Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష.. లగ్జరీ వ్యాన్పై కొనసాగుతున్న రచ్చ!
- బీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థుల ఆందోళన..
- నిరుద్యోగులకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్..
- ప్రశాంత్ కిశోర్ దీక్ష శిబిరం వద్ద లగ్జరీ వ్యాన్ ఉండటంపై తీవ్ర విమర్శలు చేసిన రాజకీయ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant Kishor: బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పట్నాలోని గాంధీ విగ్రహం వద్ద ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో అక్కడ ఓ లగ్జరీ వ్యాన్ ఉండటంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వ్యాన్ పీకేకు చెందినది.. అందులో ఏసీ, కిచెన్, బెడ్రూం లాంటి సకల సదుపాయాలు ఉన్నాయి. కోట్ల రూపాయల విలువైన ఆ వెహికిల్.. వేదిక పక్కన ఉండటంతో సోషల్ మీడియాలో రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక, దీనిపై జన్ సురాజ్ పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఆ వ్యాన్ అక్కడ ఉండటం అసలు సమస్య కాదు.. ఇక్కడ పట్టించుకోవాల్సిన అంశం విద్యార్థుల భవిష్యత్తు అని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే దానిని మధ్యలోకి లాగుతున్నారని మండిపడ్డారు.
Read Also: Narendra Modi: గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు..
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఇక, డిసెంబర్ 13వ తేదీన నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసి.. కొత్తగా మరోసారి నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆ పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు వెల్లడించారు. ఈక్రమంలో ఉద్యోగార్థులు తమ నిరసనను మరింత ఉద్ధృతం చేయగా.. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ వాళ్లకు సపోర్టుగా నిలిచారు. విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే వరకు నా నిరసన కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
-
Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
-
Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!