Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష.. లగ్జరీ వ్యాన్పై కొనసాగుతున్న రచ్చ!
- బీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థుల ఆందోళన..
- నిరుద్యోగులకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్..
- ప్రశాంత్ కిశోర్ దీక్ష శిబిరం వద్ద లగ్జరీ వ్యాన్ ఉండటంపై తీవ్ర విమర్శలు చేసిన రాజకీయ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant Kishor: బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పట్నాలోని గాంధీ విగ్రహం వద్ద ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో అక్కడ ఓ లగ్జరీ వ్యాన్ ఉండటంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వ్యాన్ పీకేకు చెందినది.. అందులో ఏసీ, కిచెన్, బెడ్రూం లాంటి సకల సదుపాయాలు ఉన్నాయి. కోట్ల రూపాయల విలువైన ఆ వెహికిల్.. వేదిక పక్కన ఉండటంతో సోషల్ మీడియాలో రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక, దీనిపై జన్ సురాజ్ పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఆ వ్యాన్ అక్కడ ఉండటం అసలు సమస్య కాదు.. ఇక్కడ పట్టించుకోవాల్సిన అంశం విద్యార్థుల భవిష్యత్తు అని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే దానిని మధ్యలోకి లాగుతున్నారని మండిపడ్డారు.
Read Also: Narendra Modi: గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు..
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ఇక, డిసెంబర్ 13వ తేదీన నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసి.. కొత్తగా మరోసారి నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆ పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు వెల్లడించారు. ఈక్రమంలో ఉద్యోగార్థులు తమ నిరసనను మరింత ఉద్ధృతం చేయగా.. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ వాళ్లకు సపోర్టుగా నిలిచారు. విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే వరకు నా నిరసన కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!