Arvind kejriwal: భగవద్గీత శ్లోకాన్ని తప్పుగా చదివిన కేజ్రీవాల్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind kejriwal: గుజరాత్ పర్యటనలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భగవద్గీతలోని శ్లోకాన్ని తప్పుగా పలికిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు రోజుల పాటు గుజరాత్లో పర్యటించిన కేజ్రీవాల్ ఈ సూచన చేశారు. గుజరాత్ లో ఎలాగైనా పట్టు సాధించాలన్న ఉద్దేశంతో అరవింద్ కేజ్రీవాల్ విస్తృతంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సూరత్లోని ద్వారకాదీష్ ఆలయం వెలుపల విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, ఢిల్లీ ముఖ్యమంత్రి సంస్కృతంలో తన సొంత శ్లోకాన్ని (పద్యాన్ని) రూపొందించారు. ఈ సందర్భంగా తన పార్టీ గుర్తు చీపురును గుర్తు చేస్తూ.. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ జరుగుతోంది.
భగవద్గీతలోని “యదా యదా హి ధర్మస్య” అనే శ్లోకాన్ని ప్రస్తావిస్తూ దానికి బదులుగా “యదా యదా హి ధజ్” అని అన్నారు. అనంతరం కేజ్రీవాల్ ఈ పద్యం గురించి వివరించారు. భూమిపై చెడు పెచ్చరిల్లినప్పుడల్లా భగవంతుడు తన చీపురుకు పని చెప్పాల్సి వస్తుండంటూ.. తమ పార్టీ గుజరాత్లో చెడును ఊడ్చేసేందుకు వచ్చిందన్నట్టుగా కేజ్రీవాల్ మాట్లాడారు. అయితే శ్లోకాన్ని కేజ్రీవాల్ తప్పుగా పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై ఆప్ ఇంకా స్పందించలేదు. ఈ వీడియో ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. కేజ్రీవాల్ పవిత్ర గ్రంథంలోని తప్పుడు పద్యం ఉపయోగించారని నెటిజన్లు వెంటనే ఎత్తిచూపారు. విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ శ్రేణులు, అభిమానుల నుంచి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Ghulam Nabi Azad: కాంగ్రెస్ మా రక్తంతో తయారైంది.. కంప్యూటర్లు, ట్విట్టర్లతో కాదు..
‘‘ఎవరు వీరంతా.. ఎక్కడి నుంచి వస్తారు ఇలాంటి వారు’, ‘ఇలా శ్లోకం ఎవరు చెప్పారు? ఈయనకు ఎప్పుడు చెప్పారు..?’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. “గీతలోని ఏ అధ్యాయంలో భగవంతుడు ఇలా చెప్పాడు..? మరి ఈ దేవుడు చీపురు గురించి ఏ పుస్తకంలో చదివాడు? నిజంగా ఇలాంటి వ్యక్తులు ఈ భూమిపై చాలా అరుదుగా కనిపిస్తారు” అని మరొకరు ట్వీట్ చేశారు. ‘కేజ్రీవాల్కు శ్లోకాలు తెలియకపోతే.. వాటిని పఠించకుంటే బాగుంటుంది. ధర్మాన్ని నిలబెట్టేందుకు భగవంతుడి చేతిలో పెట్టుకున్న సుదర్శన చక్రాన్ని.. చీపురు కట్టతో పోల్చవద్దు. ఆ దేవుడు మీకు కనీస జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం..” అంటూ పెద్ద సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. కేజ్రీవాల్ శుక్ర, శనివారాల్లో గుజరాత్లో పర్యటించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సవాల్ విసిరేందుకు ఆయన సర్వత్రా ప్రచారం చేస్తున్నారు. శనివారం ఢిల్లీ సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో ఓడిపోతామన్న బెంగ బీజేపీలో ఉందన్నారు. ఇటీవల ఆప్ నాయకుడిపై దాడి చేయడంతో ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు. ఆప్ గుజరాత్లో 12 సీట్లను గెలుచుకుంటుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
https://twitter.com/panditji2590/status/1566056824998338561?cxt=HHwWgoDRgdKY4LsrAAAA
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!