Arvind Kejriwal: 2024లో బీజేపీ గెలిచినా.. 2029లో ఆ పార్టీ నుంచి దేశాన్ని విముక్తి చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత బీజేపీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి ఆప్ అతిపెద్ద ముప్పుగా ఉందని, అందుకే తమ పార్టీపై, నేతలపై అన్ని వైపుల నుంచి దాడులు చేస్తోందని కేజ్రీవాల్ అన్నారు. తాను అనేక దాడుల్ని ఎదుర్కొంటున్నానని, ఇప్పుడు తనను అరెస్ట్ చేయాలని బీజేపీ అనుకుంటుందని, తనను అరెస్ట్ చేసినా, తన ఆలోచనల్ని బీజేపీ అడ్డుకోగలదా..? అని సవాల్ విసిరారు.
Read Also: Neti Bharatham: ఒకే పాత్రతో ‘నేటి భారతం’ సినిమా.. ఆసక్తికరంగా ట్రైలర్
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
అరవింద్ కేజ్రీవాల్ ఇలా విశ్వాస పరీక్ష పెట్టుకోవడం ఇది రెండో సారి. 70 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తామని చెబుతూ.. బీజేపీ నేతలు తమ ఇద్దరు ఎమ్మెల్యేలను సంప్రదించారిన ఆయన మరోసారి ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు, వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ ఇచ్చారని, అయినా కూడా తమ ఎమ్మెల్యేలు తలొగ్గలేదని చెప్పారు.
2024 ఎన్ని్కల్లో బీజేపీ గెలిచినప్పటికీ, 2029లో బీజేపీ నుంచి దేశాన్ని ఆప్ విముక్తి చేస్తుందని కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు మమ్మల్ని అధికారంలోకి దించాలని చెబుతున్నారని, ఇదే హామీతో మీరు ప్రజల్ని ఓట్లు అడగండి, నేనే మీ కోసం పనిచేస్తా అని అన్నారు. బీజేపీ భవిష్యత్తుపై భయం ఉందని అందుకు కారణం ఆప్ అని కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీ కేంద్ర ఏజెన్సీల ద్వారా తమ మంత్రుల్ని అరెస్ట్ చేసిన తీరును దేశం మొత్తం చూసిందని, ప్రజలు మూర్ఖులని వారు భావిస్తున్నారా.?? అంటూ ప్రశ్నించారు. వారు రామ భక్తులమని చెప్పుకుంటారు, కానీ ఆస్పత్రుల్లో ప్రజలకు వైద్యం అందించరని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..