Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సరికొత్త వివాదం
- ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను
- జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సరికొత్త వివాదానికి దారి తీస్తోంది. ఫిబ్రవరి 27న లిక్కర్ స్కామ్ కేసును ట్రయల్ కోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది.
అయితే ఈ కేసు జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్కు వెళ్లింది. అయితే జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి ఉన్నారని.. బీజేపీ అనుబంధ సమావేశాల్లో పాల్గొన్నారని.. ఇలాగైతే తమకు న్యాయం జరగదని.. తన కేసు నుంచి స్వర్ణకాంత శర్మను తప్పించాలంటూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ను ఇటీవల న్యాయస్థానం కొట్టేసింది.
Also Read
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
తాజాగా జస్టిస్ స్వర్ణకాంత శర్మకు కేజ్రీవాల్ లేఖ రాశారు. వ్యక్తిగతంగా గానీ న్యాయవాది ద్వారా గానీ ఆమె ఎదుట హాజరుకాబోనని లేఖలో పేర్కొన్నారు. ‘‘జస్టిస్ స్వర్ణకాంత నుంచి న్యాయం లభిస్తుందన్న నా ఆశలు ఆవిరయ్యాయి. అందువల్ల నేను గాంధీజీ సత్యాగ్రహాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. నా మనస్సాక్షి ఆధారంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు ఇస్తే.. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే హక్కును నేను కలిగి ఉంటాను.’’ అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
2024లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలను కుదిపేసింది. అనంతరం 2025లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. అనూహ్యంగా ఈ కేసును గత ఫిబ్రవరి 27, 2026న ట్రయల్ కోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అయితే తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారిస్తున్నారు. ఆమె ఆర్ఎస్ఎస్ సానుభూతిపరురాలని.. అలాగైతే ఈ కేసులో తమకు న్యాయం జరగదని.. విచారణ నుంచి తప్పించాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ను ఏప్రిల్ 20న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. తాజాగా ఆ న్యాయమూర్తి ముందు హాజరుకాబోనని తేల్చి చెబుతూ కేజ్రీవాల్ లేఖ రాశారు.
AAP National Convenor Arvind Kejriwal writes to Justice Swarana Kanta Sharma stating that he will not appear before her in person or through a lawyer.
Kejriwal writes, "My hope of getting justice from Justice Swarn Kanta is shattered. Therefore, I have decided to follow… pic.twitter.com/PIgznx0LUQ
— ANI (@ANI) April 27, 2026
తాజావార్తలు
-
S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
-
Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
-
CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
-
Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
-
VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!