CM Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal proves majority, wins trust vote in Delhi Assembly: ఆప్, బీజేపీల మధ్య వివాదం చెలరేగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాాల్ తో పాటు మనీష్ సిసోడియా ఆరోపిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లను బీజేపీ ఆఫర్ చేసిందని ఆప్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారు. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ఆదరణతోనే కేంద్రప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి ఆప్ నాయకులను టార్గెట్ చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా గురువారం రోజు ఢిల్లీ అసెంబ్లీలో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష నిర్వహించారు. విశ్వాస పరీక్షలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి విశ్వాస పరీక్షలో అనుకూలంగా ఓటు వేశారు. మొత్తం 70 మంది సభ్యులు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆఆప్కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ ను ఈజీగా ఆప్ పార్టీ దాటి మెజారిటీని నిరూపించుకుంది.
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
Read Also: MP Aravind: బీహార్ వెళ్లి సీఎం కేసీఆర్ తెలంగాణ పరువు తీశారు.
తమ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ప్రతిపక్ష బీజేపీ ‘ ఆపరేషన్ కమలం’ విఫలమైందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. విశ్వాస తీర్మాణాన్ని ఆగస్టు 29న ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. గురువారం ఓటింగ్ జరిగింది. బీజేపీ ఆపరేషన్ కమలం ‘ ఆపరేషన్ కిచడ్’గా మారిందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం ఆప్ పార్టీకి మొత్తం 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇద్దరు విదేశాల్లో ఉండగా.. మరోకరు జైలు, ఇంకొకరు స్పీకర్ గా ఉన్నారు. మిగతా 58 మంది కేజ్రీవాల్ కు మద్దతు ప్రకటించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో డిప్యూటీ సీెం మనీస్ సిసోడియాకు కేజ్రీవాల్ మద్దతుగా నిలిచారు. సీబీఐ దాడుల్లో సిసోడియా ఇంట్లో ఏం కనుక్కొలేదని.. ఆయన డబ్బు లేదని వాడని ఢిల్లీ సీఎం వ్యాఖ్యానించారు. 16 ఏళ్ల బాలికపై తుపాకితో కాల్పులు జరిపిన సంగమ్ విహార్ కేసులో తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, హోం మంత్రిని కోరారు సీఎం కేజ్రీవాల్.
తాజావార్తలు
-
Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
-
BMW X6 Facelift: భారత్లో BMW X6 ఫేస్లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
ట్రెండింగ్
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!