Arvind Kejriwal: నా భార్య ‘‘ఝాన్సీ రాణి’’.. సునీతా కేజ్రీవాల్ని ప్రమోట్ చేస్తున్న ఆప్ చీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన భార్యను ప్రమోట్ చేసే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇరుకున్న కేజ్రీవాల్ని మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది, దాదాపుగా 50 రోజుల పాటు జైలులో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసమని మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది. అయితే, బెయిల్పై వచ్చిన ఆయన ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాను జైలుకు వెళ్లకూడదంటే తనకు ఓటేయాలని ప్రజల్ని కోరుతున్నారు. అదే విధంగా “అచ్ఛే దిన్ ఆనే వాలే హై, మోడీ జీ జానే వాలే హై” అంటూ నినాదాలు చేస్తున్నారు.
Also Read
- Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
ఇదిలా ఉంటే మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉండటంతో తన భార్య సునీతా కేజ్రీవాల్ని ప్రమోట్ చేసే ఉద్దేశం కనిపిస్తోందిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తాను జైలులో ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించిన భార్య సునీతా కేజ్రీవాల్ని ప్రశంసించారు. ‘‘ఝాన్సీ కి రాణి’’ అంటూ అభివర్ణించారు. ‘‘ఈ రోజు నా భార్య వెంట ఉంది, నేను లేనప్పుడు ఆమె అన్నీ చూసుకుంది, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను కలవడానికి వచ్చేది. ఆమె ద్వారా నా ఢిల్లీ వాసుల యోగక్షేమాలు తెలుసునేవాడిని, ఆమె నా సందేశాలు తీసుకువచ్చేది. ఆమె ఝాన్సీకి రాణి లాంటిది’’ అంటూ తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో కేజ్రీవాల్ అన్నారు.
మీ ఆశీర్వాదం వల్లే నా భర్త ఈ రోజు మాతో ఉన్నారు, మంచి పనిచేసేవారికి దేవుడు సాయం చేస్తాడని, నా భార్య జైలుకు వెళ్లకూడదనుకుంటే మే 25న ఆప్కి ఓటేయండి అంటూ ప్రజల్ని కోరారు. తాను అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇస్తానని కేజ్రీవాల్ మరోసారి హామీ ఇచ్చారు. జూన్ 4 తర్వాత నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడదని, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం కారణంగా దేశం మొత్తం బీజేపీపై కోపంతో ఉన్నారని చెప్పారు. ఢిల్లీలోని మొత్తం 7 పార్లమెంట్ స్థానాలకు జూన్ 25న ఆరో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
-
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!