Apple: జీతాల మోసం..185 మందిని తొలగించిన యాపిల్.. ఇంత కక్కుర్తి ఎందుకు..
- యాపిల్ సంస్థ ఉద్యోగుల ఘరానా మోసం..
- ఛారిటీ నిబంధనలు ఉపయోగించి ఫ్రాడ్..
- 185 మంది ఉద్యోగుల్ని తొలగించిన యాపిల్..
- ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారతీయులే..
- యూఎస్ తెలుగు సంఘాలతో సంబంధం..
Apple: జీతాల మోసానికి పాల్పడిన ఉద్యోగులను యాపిల్ సంస్థ తొలగించింది. ఛారిటీ నిబంధనలను దుర్వినియోగం చేసిన ఉద్యోగులను తీసేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు కోల్పోయిన వారిలో భారతీయులతో సహా 185 మంది ఉన్నట్లు సమాచారం. ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అనుమతించే కార్యక్రమాన్ని ఉద్యోగులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నివేదికల ప్రకారం..జీతాల మోసానికి పాల్పడ్డారు. తమ పరిహారాన్ని పెంచుకోవడానికి మెసానికి పాల్పడ్డారని గుర్తించారు. దీంతో యాపిల్ దీనితో సంబంధం ఉన్న ఉద్యోగులను తొలగించింది. తొలగించబడిన ఉద్యోగుల్లో బే ఏరియాలోని అధికారులు ఆరుగురిని గుర్తించారు. వారిపై అరెస్ట్ వారెంట్ల్ జారీ చేయబడ్డాయి. అయితే, ఆరుగురిలో ఎవరూ భారతీయులు లేరు. కానీ తొలగించబడిని ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వ్యక్తులే ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Also Read
- Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
Read Also: Cyberabad Police: సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..
అమెరికాలోని కొన్ని తెలుగు స్వచ్ఛంద సంస్థలను దుర్వినియోగం చేసి మోసానికి పాల్పడినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. అయితే, దీనిపై యాపిల్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. లాస్ ఏంజిల్స్లోని జిల్లా న్యాయవాది కార్యాలయం రిపోర్టుల ప్రకారం.. యాపిల్ తన మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ని దుర్వినియోగం చేసిన కారణంగా బే ఏరియా ఆఫీసు నుంచి అనేక మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది.
ఉద్యోగుల్లో సామాజిక బాధ్యతను పెంచేందుకు, లాభాపేక్ష లేని సంస్థలకు సేవా కార్యక్రమాల కోసం విరాళాలు ఇచ్చేలా ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తుంది. ఇలా ఉద్యోగులు ఏ సంస్థకైతే విరాళం ఇస్తారో, ఆ సంస్థకు మ్యాచింగ్ గ్రాంట్ కలిపి యాపిల్ విరాళం ఇస్తుంది. ఇదే ఉద్యోగులకు వరంగా మారింది. సదరు సంస్థలు తిరిగి ఈ విరాళాలను సేవ కోసం ఉపయోగించకుండా ఉద్యోగులకు రిటర్న్ చేసినట్లు తేలింది. యూఎస్ కంపెనీల టాక్స్ లెక్కలను చూసే ఇంటర్నల్ రెవన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) ఉద్యోగుల మోసాన్ని కనిపెట్టింది.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!