Apple: జీతాల మోసం..185 మందిని తొలగించిన యాపిల్.. ఇంత కక్కుర్తి ఎందుకు..
- యాపిల్ సంస్థ ఉద్యోగుల ఘరానా మోసం..
- ఛారిటీ నిబంధనలు ఉపయోగించి ఫ్రాడ్..
- 185 మంది ఉద్యోగుల్ని తొలగించిన యాపిల్..
- ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారతీయులే..
- యూఎస్ తెలుగు సంఘాలతో సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple: జీతాల మోసానికి పాల్పడిన ఉద్యోగులను యాపిల్ సంస్థ తొలగించింది. ఛారిటీ నిబంధనలను దుర్వినియోగం చేసిన ఉద్యోగులను తీసేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు కోల్పోయిన వారిలో భారతీయులతో సహా 185 మంది ఉన్నట్లు సమాచారం. ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అనుమతించే కార్యక్రమాన్ని ఉద్యోగులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నివేదికల ప్రకారం..జీతాల మోసానికి పాల్పడ్డారు. తమ పరిహారాన్ని పెంచుకోవడానికి మెసానికి పాల్పడ్డారని గుర్తించారు. దీంతో యాపిల్ దీనితో సంబంధం ఉన్న ఉద్యోగులను తొలగించింది. తొలగించబడిన ఉద్యోగుల్లో బే ఏరియాలోని అధికారులు ఆరుగురిని గుర్తించారు. వారిపై అరెస్ట్ వారెంట్ల్ జారీ చేయబడ్డాయి. అయితే, ఆరుగురిలో ఎవరూ భారతీయులు లేరు. కానీ తొలగించబడిని ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వ్యక్తులే ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: Cyberabad Police: సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..
అమెరికాలోని కొన్ని తెలుగు స్వచ్ఛంద సంస్థలను దుర్వినియోగం చేసి మోసానికి పాల్పడినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. అయితే, దీనిపై యాపిల్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. లాస్ ఏంజిల్స్లోని జిల్లా న్యాయవాది కార్యాలయం రిపోర్టుల ప్రకారం.. యాపిల్ తన మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ని దుర్వినియోగం చేసిన కారణంగా బే ఏరియా ఆఫీసు నుంచి అనేక మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది.
ఉద్యోగుల్లో సామాజిక బాధ్యతను పెంచేందుకు, లాభాపేక్ష లేని సంస్థలకు సేవా కార్యక్రమాల కోసం విరాళాలు ఇచ్చేలా ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తుంది. ఇలా ఉద్యోగులు ఏ సంస్థకైతే విరాళం ఇస్తారో, ఆ సంస్థకు మ్యాచింగ్ గ్రాంట్ కలిపి యాపిల్ విరాళం ఇస్తుంది. ఇదే ఉద్యోగులకు వరంగా మారింది. సదరు సంస్థలు తిరిగి ఈ విరాళాలను సేవ కోసం ఉపయోగించకుండా ఉద్యోగులకు రిటర్న్ చేసినట్లు తేలింది. యూఎస్ కంపెనీల టాక్స్ లెక్కలను చూసే ఇంటర్నల్ రెవన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) ఉద్యోగుల మోసాన్ని కనిపెట్టింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!