UP: మాజీ సీఎం సోదరుడు షాకింగ్ ప్రకటన.. భార్యతో విడిపోతున్నట్లు పోస్ట్
- ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో షాకింగ్ పరిణామం
- విడిపోతున్న మాజీ సీఎం సోదరుడి దంపతులు
- సోషల్ మీడియాలో కీలక పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో షాకింగ్ పరిణామం జరిగింది. ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలోని వివాదం రచ్చ చేస్తోంది. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ సంచలన ప్రకటన చేశాడు. తన భార్య అపర్ణ యాదవ్ నుంచి విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వార్త ఇప్పుడు యూపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
వీలైనంత త్వరగా భార్యతో విడిపోవాలని అనుకుంటున్నట్లుగా ఇన్స్టాగ్రామ్లో ప్రతీక్ యాదవ్ రాసుకొచ్చాడు. తన భార్య కుటుంబ సంబంధాలను నాశనం చేస్తోందని.. సొంత కీర్తి, ప్రభావాన్ని పెంచుకోవడం కోసం ప్రాకులాడుతోందని తీవ్ర ఆరోపణలు చేశాడు. తన భార్య ఎప్పుడూ పట్టించుకోలేదని.. ప్రస్తుతం తాను మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఇంత స్వార్థపూరిత ఆలోచనను తాను ఎప్పుడూ చూడలేదని.. వివాహం పట్ల చింతిస్తున్నట్లుగా వాపోయాడు.
Also Read
- Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
- CM Vijay: సీఎం విజయ్కు షాక్.. కాన్వాయ్లోకి దూకిన దంపతులు.. పోలీసులు హడల్
- Uttar Pradesh: ఎన్నికల ముందు, అఖిలేష్తో CJP నేత రాంకా కీలక భేటీ.. యూపీలో ఏం జరగబోతోంది?
- India-Belgium: పాకిస్థాన్తో ఎలాంటి సంబంధాలుండవు.. భారత్కు బెల్జియం హామీ
అయితే భర్త ప్రతీక్ యాదవ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్పై భార్య అపర్ణ యాదవ్ ఇంకా స్పందించలేదు. దీనిపై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సస్పెన్ష్గా ఉంది.
ఇది కూడా చదవండి: US Video: తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఊడిపోయిన ముందు చక్రం
ప్రతీక్ యాదవ్-అపర్ణ యాదవ్కు 2011లో వివాహం జరిగింది. వీరి వివాహం ఉత్తర ప్రదేశ్లో అత్యంత హై ప్రొఫైల్ వివాహాల్లో ఒకటిగా నిలిచింది. ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, అనిల్ అంబానీతో సహా అనేక మంది ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. వీరికి ఒక కూతురు ఉంది.
ప్రతీక్ యాదవ్ ములాయం చిన్న కుమారుడు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోదరుడు. ఇక భార్య అపర్ణ యాదవ్.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. అనంతరం 2022లో ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో సీఎం యోగి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకుంది. అటు తర్వాత ఆయోధ్య రామాలయం కోసం రూ.11లక్షలు విరాళం ఇచ్చింది. అయితే బీజేపీలో చేరిన దగ్గర నుంచి ములాయం కుటుంబంలో విభేదాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. సొంత ఇమేజ్ కోసం ఆమె ప్రాకులాడినట్లుగా సమాచారం. ఈ కారణంతోనే విభేదాలు తలెత్తి విడాకుల దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

తాజావార్తలు
-
Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
-
Raids: మాదాపూర్లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
-
Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్దే.. కఠిన చర్యలకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
-
CM Vijay: సీఎం విజయ్కు షాక్.. కాన్వాయ్లోకి దూకిన దంపతులు.. పోలీసులు హడల్
-
IPO Listing: భారత్లో ఐపీఓల జాతర.. వచ్చే వారంలోకి మార్కెట్లోకి 11 పబ్లిక్ ఇష్యూలు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!