Apache Helicopter : పాక్ సరిహద్దుకు ‘అపాచీ హెలికాప్టర్లు’..!
- పాక్ సరిహద్దుల్లో అపాచీ హెలికాప్టర్ల మోహరం
- అమెరికా నుంచి మూడు హెలికాప్టర్లు ఈ నెలలో భారత్కు
- సమగ్ర రక్షణ కోసం భారత ఆర్మీకి అధునాతన ఆయుధ శక్తి
Apache Helicopter : పాకిస్తాన్తో సరిహద్దుల్లో ఉగ్రవాద గూళ్లపై దాడులకు భారత సైన్యం ముందు నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత సరిహద్దుల్లో రక్షణను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, అత్యాధునిక ఆపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్లను భారత్ మోహరించనుంది. ఈ మేరకు ఇప్పటికే అమెరికాతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
అమెరికా తయారీ ఆధునిక యుద్ధ హెలికాప్టర్లు ‘అపాచీ AH-64E’లు ఈ నెలలో భారత్కు చేరనున్నాయి. మొదటి విడతగా మూడు హెలికాప్టర్లు జూలై నెలలో భారత్కి రానుండగా, మిగిలిన మూడు 2024 చివర్లో అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 6 అపాచీల కొరకు భారత్ 2020లో అమెరికాతో 600 మిలియన్ డాలర్లు (అంటే సుమారు రూ. 5000 కోట్లు) విలువైన ఒప్పందాన్ని చేసుకుంది.
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
ప్రారంభంగా 2024 మార్చిలోనే డెలివరీ పూర్తవ్వాల్సి ఉండగా, పలు లాజిస్టిక్ కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యం అయింది. ఇప్పుడు తిరిగి ప్రక్రియ వేగాన్ని పుంజుకుంటోంది.
Sigachi Company: బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. వైద్య ఖర్చులన్నీ మేమే చెల్లిస్తాం..!
అపాచీ AH-64E ప్రత్యేకతలు ఏమిటంటే?
డబుల్ టర్బైన్ ఇంజిన్ వున్న ఈ హెలికాప్టర్, అధిక ఎత్తుల్లో కూడా ఫుల్ సామర్థ్యంతో పనిచేస్తుంది. Hellfire మిసైల్లు, 70mm రాకెట్లు, 30mm గన్ వంటి శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలతో లభిస్తుంది. పగటి , రాత్రి ఆపరేషన్లలో కూడా సమర్థంగా పనిచేయగల సామర్థ్యం ఉంది. రిఅల్ టైమ్ టార్గెట్ ట్రాకింగ్, హైవిజన్ నైట్ వియన్ టెక్నాలజీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది అత్యంత ఖచ్చితంగా లక్ష్యాలను తాకే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు, శత్రు వాహనాలు, బంకర్లు, ట్యాంకులు వంటి వాటిని ధ్వంసం చేయగలదు.
ఎక్కడ మోహరించనుంది?
ఈ అపాచీలను ప్రత్యేకంగా సైనిక అవసరాల కోసం ఇండియన్ ఆర్మీకి అప్పగిస్తున్నారు. ముఖ్యంగా పాక్ సరిహద్దుల్లో, జమ్ము-కాశ్మీర్ ప్రాంతాల్లో తీవ్రమైన ఉగ్రవాద దాడులు, చొరబాట్ల నేపథ్యంలో ఈ హెలికాప్టర్ల మోహరింపు కీలకంగా మారింది. ఇప్పటికే లడఖ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్ తదితర ప్రాంతాల్లో అపాచీ హెలికాప్టర్ల కోసం ప్రత్యేక హ్యాంగర్లు సిద్ధం చేస్తున్నారు.
అమెరికాతో కూటమి బలపడుతోందా?
అవును. ఇటీవల భారత్-అమెరికా సంబంధాలు స్ట్రాటజిక్ పరంగా మరింత బలపడుతున్నాయి. డ్రోన్ ఒప్పందాలు, జెట్ ఇంజిన్ సహకారం, మిలిటరీ టెక్నాలజీ షేరింగ్ వంటి అంశాలతో పాటు, అపాచీల డెలివరీ కూడా రెండువైపుల నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.
పాక్ నుంచి వచ్చే ముప్పు, LOC వద్ద తరచూ జరిగే ఉగ్రదాడులు, డ్రోన్ చొరబాట్లను దృష్టిలో ఉంచుకుని అపాచీల మోహరింపు నిర్ణయాత్మకంగా భావించవచ్చు. అత్యాధునిక ఆయుధాల చేతిలో ఉండటం సైనికుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రత్యేకించి పహాడీ ప్రాంతాల్లో, అపాచీల ప్రభావం శత్రువులపై మరింత భయాందోళనను కలిగించేలా ఉంటుంది.
Delhi: రూ. 84 లక్షల మెర్సిడెస్-బెంజ్ను.. రూ.2.5 లక్షలకే అమ్మిన ఓనర్.. కారణం ఇదే..?
తాజావార్తలు
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!