Rahul Gandhi: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు.. బీబీసీ విషయంలో ఇదే జరిగింది..
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ యూకేలో పర్యటిస్తున్నారు. ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇదిలా ఉంటే లండన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మరోసారి భారత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీని గుడ్డిగా విశ్వసించే ఎవరికైనా మద్దతు ఉంటుందని, మోదీపై, ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తే వారిపై దాడులు జరుగుతున్నాయని, బీబీసీపై ఇదే విధంగా దాడి జరిగిందని ఆయన అన్నారు.
2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ పాత్రపై బీబీసీ ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’పేరుతో రెండు భాగాల డాక్యుమెంటరీని రూపొందించింది. ఇది యూకే, ఇండియాలో వివాదాస్పదం అయింది. భారత విదేశాంగ శాఖ దీన్ని వలసవాద మనస్తత్వంగా అభివర్ణించింది. దీని తర్వాత ముంబై, ఢిల్లీ బీబీసీ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.
Also Read
Read Also: Allahabad High Court: కేంద్రం ఆవును రక్షిత జాతీయ జంతువుగా ప్రకటిస్తుందని ఆశిద్దాం..
ఇదిలా ఉంటే.. తదుపరి ప్రధాని అభ్యర్థి మీరేనా..? అని అక్కడి మీడియా రాహుల్ గాంధీని ప్రశ్నించింది. అయితే ప్రస్తుతానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను ఓడించడమే ప్రతిపక్షాల ఉమ్మడి లక్ష్యం అని అన్నారు. నిరుద్యోగం సమస్యల పరిష్కారంపై రాహుల్ మాట్లాడుతూ.. ప్రజలతో మాట్లాడటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. విదేశాల్లో భారత్ ను చెడుగా చూపించిన వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని బీజేపీ విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా చేసిందేం లేదని ప్రధాని విదేశాల్లో అనడం తనకు గుర్తుందని, పదేళ్లలో మనం ఓడిపోయామని అన్నారని, భారత్ లో అపరిమిత అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
నేనెప్పుడూ దేశం పరువు తీయలేదని, 70 ఏళ్లలో ఏమీ జరగలేదని చెప్పడం ప్రతీ భారతీయుడిని అవమానించడం కాదా..? అని ప్రశ్నించారు. భారత సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘనను అనుమతించమని చైనా విషయంలో కామెంట్ చేశారు. వాస్తవేమిటంటే చైనా ఆర్మీ భారత భూభాగంలోకి వచ్చి, మన సైనికులను చంపారని, ప్రధాన మంత్రి దీన్ని తిరస్కరించారని రాహుల్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!