Rahul Gandhi: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు.. బీబీసీ విషయంలో ఇదే జరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ యూకేలో పర్యటిస్తున్నారు. ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇదిలా ఉంటే లండన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మరోసారి భారత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీని గుడ్డిగా విశ్వసించే ఎవరికైనా మద్దతు ఉంటుందని, మోదీపై, ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తే వారిపై దాడులు జరుగుతున్నాయని, బీబీసీపై ఇదే విధంగా దాడి జరిగిందని ఆయన అన్నారు.
2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ పాత్రపై బీబీసీ ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’పేరుతో రెండు భాగాల డాక్యుమెంటరీని రూపొందించింది. ఇది యూకే, ఇండియాలో వివాదాస్పదం అయింది. భారత విదేశాంగ శాఖ దీన్ని వలసవాద మనస్తత్వంగా అభివర్ణించింది. దీని తర్వాత ముంబై, ఢిల్లీ బీబీసీ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.
Also Read
- CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
Read Also: Allahabad High Court: కేంద్రం ఆవును రక్షిత జాతీయ జంతువుగా ప్రకటిస్తుందని ఆశిద్దాం..
ఇదిలా ఉంటే.. తదుపరి ప్రధాని అభ్యర్థి మీరేనా..? అని అక్కడి మీడియా రాహుల్ గాంధీని ప్రశ్నించింది. అయితే ప్రస్తుతానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను ఓడించడమే ప్రతిపక్షాల ఉమ్మడి లక్ష్యం అని అన్నారు. నిరుద్యోగం సమస్యల పరిష్కారంపై రాహుల్ మాట్లాడుతూ.. ప్రజలతో మాట్లాడటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. విదేశాల్లో భారత్ ను చెడుగా చూపించిన వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని బీజేపీ విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా చేసిందేం లేదని ప్రధాని విదేశాల్లో అనడం తనకు గుర్తుందని, పదేళ్లలో మనం ఓడిపోయామని అన్నారని, భారత్ లో అపరిమిత అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
నేనెప్పుడూ దేశం పరువు తీయలేదని, 70 ఏళ్లలో ఏమీ జరగలేదని చెప్పడం ప్రతీ భారతీయుడిని అవమానించడం కాదా..? అని ప్రశ్నించారు. భారత సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘనను అనుమతించమని చైనా విషయంలో కామెంట్ చేశారు. వాస్తవేమిటంటే చైనా ఆర్మీ భారత భూభాగంలోకి వచ్చి, మన సైనికులను చంపారని, ప్రధాన మంత్రి దీన్ని తిరస్కరించారని రాహుల్ ఆరోపించారు.
తాజావార్తలు
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!