సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను ముంబై ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు ఆయన తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలోని స్థానిక ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో ముంబై ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు చెబుతున్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా అన్నా హజారే బలహీనపడారు. ప్రస్తుతం అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ గౌతమ్ భన్సాలీ పర్యవేక్షణలో ఉన్నారు.
అన్నా హజారే తీవ్ర వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు తీవ్రమైన డీహైడ్రేషన్కు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్య సేవల కోసం ముంబైకి తరలించినట్లు వెల్లడించారు. ముంబై ఆస్పత్రిలో అన్నా హజారే ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు సమగ్రంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై వైద్య బృందం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అన్నా హజారే ఆరోగ్య పరిస్థితి గురించి బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

