Ankita Bhandari Case: అంకితా భండారీ హత్య.. పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ankita Bhandari Case: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంకితా భండారీ హత్య కేసు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేత కుమారుడి రిసార్టులో పనిచేస్తున్న అంకితాను హత్య చేశారు. ఈ హత్యలో బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య కీలక నిందితుడిగా ఉన్నారు. దీంతో శుక్రవారం వినోద్ ఆర్యను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే కాలువలో పడిన అంకితా భండారీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. తాజాగా అటాప్సీ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంకితా భండారీ నీటిలో మునిగి ఉపిరాడక చనిపోయారాని నివేదిక వెల్లడించింది. మరణానికి ముందు ఆమె శరీరంపై గాయాలను కనుక్కున్నట్లు రిపోర్టు పేర్కొంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆమె మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: Cricket Tickets Mafia Live: క్రికెట్ టికెట్లతో మాఫియా రాజ్యం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న 19 ఏళ్ల అంకితా భండారి మరణం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ బీజేపీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్యతో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను అరెస్ట్ చేశారు. అమ్మాయిని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. రిసార్టుకు వచ్చే గెస్టులకు ప్రత్యేక సేవలు అందించాలని.. వ్యభిచారిణిగా వ్యవహరించాలని నిందితులు అంకితా భండారీపై ఒత్తడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీనికి ఒప్పుకోకపోవడంతోనే ఆమెను ముగ్గురు హత్య చేశారు.
ఈ కేసుపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారణకు ఆదేశించారు. సిట్ ఏర్పాటు చేసి కేసును విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిసార్టులను తనిఖీ చేయాలని.. అక్రమంగా ఉన్న రిసార్టులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుల్కిత్ ఆర్యకు సంబంధించిన రిసార్టును నిన్న కూల్చివేసింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!