Amit Shah: వారసత్వ రాజకీయాలపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: వంశపారంపర్య రాజకీయాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయాలు విషంతో సమానమని.. వాటి వల్ల ఒక కుటుంబం రాష్ట్రాన్ని శాసించడమే కాకుండా.. నిర్ణయాలు కూడా ఒక కుటుంబం నుంచి తీసుకోవడం జరుగుతుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాల మూలంగా ఒకే కుటుంబం చెప్పుచేతులో్ల పార్టీ, ప్రభుత్వం ఉంటుందన్నారు. కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి) వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కుల ఉద్యమాలను ప్రోత్సహిస్తోందన్నారు. వీటివల్లే 2018లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని చెప్పారు. 2015 నుంచి మధ్యప్రదేశ్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో “కులతత్వపు విషాన్ని వ్యాప్తి చేయడానికి” కాంగ్రెస్ “కుల ఉద్యమాలను” ప్రేరేపించిందని దీని మూలంగానే 2018 మధ్యప్రదేశ్లో తన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఓటమి పాలయిందని అమిత్ షా గుర్తు చేశారు. 2003-2023 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వ ‘రిపోర్ట్ కార్డ్’ను విడుదల చేసిన సందర్భంగా రాష్ట్రంలో తన పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Read also: Liquor Stores: నేడు మద్యం దుకాణాల లక్కీ డ్రా.. 34 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
బీజేపీలో కూడా వంశపారంపర్య రాజకీయాలు ఉన్నాయి కదా అని అడిగిన ప్రశ్నకు అమిత్ సా బదులిస్తూ.. తాను ఏ నాయకుడి పేరు చెప్పదలచుకోలేదని.. కానీ కాంగ్రెస్, డిఎంకె, శివసేన (యుబిటి) యొక్క వంశ రాజకీయాలు అంటే ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు మాత్రమే వస్తారని అన్నారు. పార్టీ మరియు ప్రభుత్వం ఒక కుటుంబం అధీనంలోనే ఉంటుంది.. దీనినే రాజవంశ రాజకీయాలు అంటారని తెలిపారు. బీజేపీలోని నాయకుల కుటుంబ సభ్యులకు టిక్కెట్ల పంపిణీని సమర్థించిన అమిత్షా.. ఎక్కడో కొందరికి మెరిట్ ఆధారంగా టిక్కెట్లు ఇచ్చారని.. అలా అని చెప్పి వంశపారంపర్య రాజకీయాలనడం సరికాదన్నారు.. వారసత్వ రాజకీయాలు విషమని.. ఎప్పుడు పార్టీలు ఒక కుటుంబానికి ఆస్తి అవుతాయని.. అప్పుడు గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చిన వారికి స్థానం ఏముంటుందని ప్రశ్నించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లకు ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేదని ఆయన అన్నారు.
Read also: JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డికి 41 సీఆర్పీసీ నోటీసు.. నిరాకరించిన జేసీ
“నేను పార్టీకి అధ్యక్షుడిని అయ్యాను, మా కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరు. నడ్డా జీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదు. శివరాజ్ జీ (మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్) నేపథ్యం ఏమిటి? అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎజెండాతో ఆడుకోవడం ద్వారా రచ్చ. వంశపారంపర్య రాజకీయాల్లో అధికార పెత్తనం ఒక కుటుంబం చేతిలోనే ఉంటుంది” అని షా జోడించారు.
ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా బీజేపీ అధికారంలో ఉంటే చౌహాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అని అడిగిన ప్రశ్నకు షా, “మీరు పార్టీ పని ఎందుకు చేస్తున్నారు? మా పార్టీ దాని స్వంత పని చేస్తుంది. . శివరాజ్ జీ సీఎం, మేము ఎన్నికల్లో ఉన్నాం…మోదీ జీ , శివరాజ్ జీ చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి. కాంగ్రెస్ ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే హైలైట్ చేయండి అంటూ సమాధానమిచ్చారు. కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి దృష్ట్యా ఎంపీలో బీజేపీ అవకాశాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, మణిపూర్, అస్సాం, ఉత్తరప్రదేశ్లలో పార్టీ వరుస ఎన్నికల్లో విజయం సాధించిన ఉదాహరణలను షా సూచించారు. 1950లో మాకు ఏమీ లేదు, కానీ ఇప్పుడు పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు అత్యుత్తమ విజయం సాధించాం. 30 ఏళ్ల విరామం తర్వాత రెండుసార్లు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మా నాయకుడు నరేంద్ర మోడీ అని అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!