Manipur Violence: మణిపూర్ హింసాకాండపై నేడు అమిత్ షా ఆల్ పార్టీ మీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: నెల రోజుల నుంచి మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణ తీవ్ర హింసకు దారి తీసింది. సైన్యం, సీఆర్పీఎస్ బలగాలు రాష్ట్రంలో మోహరించినా పరిస్థితి చక్కబడటం లేదు. ఒక్కడో చోట హింస చెలరేగుతూనే ఉంది. నేడు మణిపూర్ పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
Read Also: Russia: రష్యాలో తిరుగుబాటు.. పుతిన్పై ప్రతీకారం తీర్చుకుంటాని వాగ్నర్ గ్రూప్ వార్నింగ్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
మణిపూర్ లో మే 3 నుంచి వరసగా హింసాత్మక ఘటనలు, కాల్పులు జరగుతుండటంతో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ పై నిషేధాన్ని జూన్ 25 వరకు పొడగించింది. మే 3న మణిపూర్లో మెయిటీలను షెడ్యూల్డ్ తెగ (ST) జాబితాలో చేర్చాలనే డిమాండ్కు నిరసనగా ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ATSU) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చెలరేగడంతో హింస చెలరేగింది. రాష్ట్రంలోని లోయ ప్రాంతంలో మైయిటీలు మెజారిటీగా ఉండగా.. కొండ ప్రాంతాల్లో కుకీలు మెజారిటీగా ఉన్నారు. ఈ రెండు వర్గాల మధ్య ప్రస్తుతం తీవ్ర ఆధిపత్య పోరు నెలకొంది. ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ దాడులు చేసుకుంటున్నారు.
ఇప్పటికే ఈ ఘర్షనల్లో 120 పైగా మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. అమిత్ షా స్వయంగా మణిపూర్ వెళ్లి అన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిటీ నాయకులతో చర్చించి శాంతిస్థాపన కోసం పిలుపునిచ్చారు. అయినా పరిస్థితి చక్కబడటం లేదు. దీనికి తోడు మయన్మార్ నుంచి వస్తున్న ఉగ్రవాదులు హింసను మరింతగా ప్రేరేపిస్తున్నారు. ఈ హింసపై రాజకీయ దుమారం కూడా చెలరేగింది. 50 రోజులుగా మణిపూర్ మండుతున్నా.. ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారని.. ప్రధాని దేశంలో లేని సమయంలో అఖిలపక్ష సమావేశం పెట్టారు..ప్రధానికి ఈ భేటీ ముఖ్యం కాదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!