Manipur Violence: మణిపూర్ హింసాకాండపై నేడు అమిత్ షా ఆల్ పార్టీ మీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: నెల రోజుల నుంచి మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణ తీవ్ర హింసకు దారి తీసింది. సైన్యం, సీఆర్పీఎస్ బలగాలు రాష్ట్రంలో మోహరించినా పరిస్థితి చక్కబడటం లేదు. ఒక్కడో చోట హింస చెలరేగుతూనే ఉంది. నేడు మణిపూర్ పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
Read Also: Russia: రష్యాలో తిరుగుబాటు.. పుతిన్పై ప్రతీకారం తీర్చుకుంటాని వాగ్నర్ గ్రూప్ వార్నింగ్..
Also Read
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
మణిపూర్ లో మే 3 నుంచి వరసగా హింసాత్మక ఘటనలు, కాల్పులు జరగుతుండటంతో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ పై నిషేధాన్ని జూన్ 25 వరకు పొడగించింది. మే 3న మణిపూర్లో మెయిటీలను షెడ్యూల్డ్ తెగ (ST) జాబితాలో చేర్చాలనే డిమాండ్కు నిరసనగా ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ATSU) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చెలరేగడంతో హింస చెలరేగింది. రాష్ట్రంలోని లోయ ప్రాంతంలో మైయిటీలు మెజారిటీగా ఉండగా.. కొండ ప్రాంతాల్లో కుకీలు మెజారిటీగా ఉన్నారు. ఈ రెండు వర్గాల మధ్య ప్రస్తుతం తీవ్ర ఆధిపత్య పోరు నెలకొంది. ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ దాడులు చేసుకుంటున్నారు.
ఇప్పటికే ఈ ఘర్షనల్లో 120 పైగా మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. అమిత్ షా స్వయంగా మణిపూర్ వెళ్లి అన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిటీ నాయకులతో చర్చించి శాంతిస్థాపన కోసం పిలుపునిచ్చారు. అయినా పరిస్థితి చక్కబడటం లేదు. దీనికి తోడు మయన్మార్ నుంచి వస్తున్న ఉగ్రవాదులు హింసను మరింతగా ప్రేరేపిస్తున్నారు. ఈ హింసపై రాజకీయ దుమారం కూడా చెలరేగింది. 50 రోజులుగా మణిపూర్ మండుతున్నా.. ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారని.. ప్రధాని దేశంలో లేని సమయంలో అఖిలపక్ష సమావేశం పెట్టారు..ప్రధానికి ఈ భేటీ ముఖ్యం కాదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
-
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
-
Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..