Jammu Kashmir: టార్గెటెడ్ కిల్లింగ్స్ పై అమిత్ షా హైలెవల్ మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ లో టార్గెటెడ్ కిల్లింగ్స్ కలకలం రేపుతున్నాయి. వరసగా కొన్ని రోజులుగా ఉగ్రవాదులు అమాయకమైన హిందువులను, ముస్లింలను చంపుతున్నారు. గురువారం కాశ్మీర్ కుల్గాంలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను కాల్చి చంపారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఇద్దరు వలస కార్మికులను చంపేశారు. దీంతో లోయ నుంచి కాశ్మీరి పండిట్లు పెద్ద సంఖ్యలో వలస వెళ్లేందుకు నిర్ణయించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ లో టార్గెట్ కిల్లింగ్స్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఈ మీటింగ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హాతో పాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోంశాఖ సీసీ అజయ్ కుమార్ భల్లా, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ పంకజ్ సింగ్, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ హాజరయ్యారు. కాశ్మీర్ లో టార్గెటెడ్ కిల్లింగ్స్, హిందువుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఉగ్రవాదుల ఏరివేతను గురించి చర్చించారు.
Also Read
- Uttar Pradesh: మహిళలకు రూ.50,000.. సంచలన నిర్ణయం దిశగా యోగి సర్కార్..
- CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
- Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
- Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్పై కేంద్రానికి కీలక ఆదేశాలు
కాశ్మీర్ లో గత వారం రోజులుగా టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ తో మొదలైన టెర్రరిస్టుల టార్గెట్ కిల్లింగ్స్ కొనసాగుతున్నాయి. ఇటీవల కాశ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ తరువాత హిందూ మహిళా ఉపాధ్యాయురాలితో పాటు రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను కాల్చి చంపారు. ఇది జరగిన కొన్ని గంటల్లోనే తాజాగా బీహార్ కు చెందిన మరో ఇద్దరు వలస కూలీలను టెర్రరిస్టులు చంపారు. దీంతో లోయలోని కాశ్మీరీ పండిట్లు భయాందోళలకు గురవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని ఆందోళన చేస్తున్నారు.
తాజావార్తలు
-
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ప్రభాస్తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
-
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
-
Uttar Pradesh: మహిళలకు రూ.50,000.. సంచలన నిర్ణయం దిశగా యోగి సర్కార్..
-
CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
-
YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!