Amit Shah: గాంధీనగర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన అమిత్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ గాంధీనగర్ ఎంపీ స్థానం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. అమిత్ షా నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా హాజరయ్యారు. బీజేపీ కంచుకోటగా ఉన్న గాంధీనగర్ నుంచి గతంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ ప్రాతినిధ్యం వహించారు. 1996 లోక్సభ ఎన్నికల్లో గాంధీనగర్, లక్నో నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పోటీ చేశారు. అయితే, ఆ తర్వాత ఆయన లక్నో సీటును నిలబెట్టుకున్నారు.
Read Also: Lok Sabha Elections: చరిత్రలో తొలిసారి.. అతి తక్కువ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ..
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
మరోవైపు గాంధీనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ కార్యదర్శి సోనాల్ పటేల్ బరిలో ఉన్నారు. 2019లో అమిత్ షా గాంధీనగర్ నుంచి బంపర్ విక్టరీ సాధించారు. ఏకంగా 69.67 శాతం ఓట్లను సాధించి, ఈ స్థానంలో బీజేపీ పవర్ ఏంటో నిరూపించారు. ఈ సారి కూడా భారీ విజయంపై అమిత్ షా కన్నేశారు.2024 లోక్సభ ఎన్నికలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో జరుగుతున్నాయి. జూన్ 4న మొత్తం 543 ఎంపీ స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. గాంధీనగర్కి మూడో దశలో అంటే మే 7న ఎన్నికలు జరగనున్నాయి.
బూత్ స్థాయి నుంచి హోం మంత్రి వరకు..
గుజరాత్ లోని మన్సాలోని ఓ గ్రామంలో జన్మించిన అమిత్ షా, ప్రస్తుతం దేశంలోనే ప్రధాని మోడీ తర్వాత నెంబర్-2 నాయకుడిగా ఉన్నారు. పార్టీకి తిరుగులేని విజయాలను కట్టబెడుతున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి స్పూర్తి పొందిన షా తన 16 ఏట ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్లడం ప్రారంభించారు. 1983లో ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీలో చేరారు. ఏబీవీపీలో చేరడానికి ముందు నరన్పురా ప్రాంతంలో బూత్ స్థాయి కార్యకర్తగా పనిచేశారు. గోడలపై బీజేపీ పోస్టర్లు అంటించారు. 1984-85లో బీజేపీలో చేరారు. అతని కాలంలోని అతడి పనితీరును పార్టీ గ్రహించి బీజేపీ యువమోర్చా జాతీయ కోశాధికారిని చేసింది.
1991లో అమిత్ షా రాజకీయ కెరీర్ మలుపు తిరిగింది. ఆ ఏడాది గాంధీనగర్ ఎంపీ స్థానంలో ఎల్కే అద్వానీ ప్రచార నిర్వహకుడిగా షా నియమితులయ్యారు. ఈ స్థానాన్ని అద్వాని సునాయాసంగా గెలుచుకున్నారు. అద్వానీ దగ్గర అమిత్ షాకి మంచి పేరు వచ్చింది. నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన సమయంలో అమిత్ షా అత్యంత నమ్మకస్తుడిగా మారారు. 2014లో కేంద్ర హోంమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు.
#WATCH | Gujarat: Union Home Minister Amit Shah files his nomination papers from the Gandhinagar Lok Sabha seat for the upcoming #LokSabhaElections2024
Gujarat CM Bhupendra Patel is also present. pic.twitter.com/89mCVhtKla
— ANI (@ANI) April 19, 2024
తాజావార్తలు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!