Toilet remark row: “సౌత్ ఇండియన్స్ నల్లగా ఉంటారు”.. బీజేపీ నేత పాత వీడియోని పోస్ట్ చేసిన డీఎంకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toilet remark row: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. హిందీ మాట్లాడేవాళ్లు తమిళనాడులో టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బీజేపీతో సహా బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఫైర్ అయ్యారు. బీజేపీ డీఎంకే ఎంపీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రతిపక్ష ఇండియా కూటమిని టార్గెట్ చేసింది. తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. బీహార్ ప్రజలు పనిచేయకపోతే మీ పనులు నడవవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Holiday: జనవరి 1న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఇదిలా ఉంటే డీఎంకేపై సర్వత్రా విమర్శలు రావడంతో, బీజేపీ నేత తరుణ్ విజయ్ దక్షిణాది వారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన పాత వీడియోను డీఎంకే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దక్షిణ భారతీయులు ‘‘నల్లగా’’ ఉంటారని ఆయన చెప్పడం వీడియోలో చూడవచ్చు. ‘‘ మేము జాత్యహంకారంతో ఉంటే దక్షిణాది ఎందుకు తమతో ఉంటుంది..తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రా వారితో ఎందుకు జీవిస్తాము..? మా చుట్టూ ఉన్న ప్రజలు నలుపు రంగులో ఉన్నారు’’ అని రాజ్యసభ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ అన్నారు. డీఎంకే ఐటీ సెల్ ఈ వీడియోను షేర్ చేసింది. 2017లో ఆల్ జజీరా టీవీలో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఈ కామెంట్స్ జాతీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ తరువాత తన వ్యాఖ్యలు క్షమాపణలు చెప్పారు.
Tarun Vijay, a BJP MP, has called South Indians "black." Isn't this racism? pic.twitter.com/rF9oTs6aWH
— இசை (@isai_) December 25, 2023
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!