Haryana Crisis: హర్యానా రాజకీయంలో కీలక పరిణామం.. బీజేపీకి మద్దతుగా చౌతాలా పార్టీ ఎమ్మెల్యేలు..!
Haryana Crisis: హర్యానా పాలిటిక్స్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్తో పాటు బీజేపీ పాత మిత్రుడు, జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా వెంటనే బలనిరూపణ పరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో చౌతాలాకు చెందిన జేజేపీ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ నేత, మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ని కలిశారు. గురువారం మధ్యాహ్నం ఈ పరిణామం చోటు చేసుకుంది.
Read Also: Shocking Incident: ఇంటికి తీసుకెళ్లే మార్గంలో 10వ తరగతి విద్యార్థినిపై ఆటోడ్రైవర్ లైంగిక వేధింపులు..
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
పానిపట్లో రాష్ట్ర మంత్రి మహిపాల్ దండా నివాసంలో ఈ సమావేశం జరిగిందని, జేజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఖట్టర్, మంత్రి ధండాతో భేటీ అయినట్లు తెలిసింది. ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఖట్టర్ వ్యాఖ్యానించినట్లు నిరాకరించారు. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ప్రస్తుత బలం 88 కాగా, అందులో బీజేపీకి 40 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.
ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణధీర్ సింగ్ గొల్లెన్, ధరంపాల్ గోండర్ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు నిలిపేయడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. గతంలో బీజేపీతో ప్రభుత్వంలో ఉన్న దుష్యంత్ సింగ్ చౌతాలా జేజేపీ లోక్సభ సీట్ల విషయంలో విభేదించి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. బీజేపీపై కోపంగా ఉన్న చౌతాలా ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి, ప్రభుత్వం మైనారిటీలో పడిండని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే మద్దతు అందిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చౌతాలా గవర్నర్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చౌతాలాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!