Haryana Crisis: హర్యానా రాజకీయంలో కీలక పరిణామం.. బీజేపీకి మద్దతుగా చౌతాలా పార్టీ ఎమ్మెల్యేలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana Crisis: హర్యానా పాలిటిక్స్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్తో పాటు బీజేపీ పాత మిత్రుడు, జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా వెంటనే బలనిరూపణ పరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో చౌతాలాకు చెందిన జేజేపీ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ నేత, మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ని కలిశారు. గురువారం మధ్యాహ్నం ఈ పరిణామం చోటు చేసుకుంది.
Read Also: Shocking Incident: ఇంటికి తీసుకెళ్లే మార్గంలో 10వ తరగతి విద్యార్థినిపై ఆటోడ్రైవర్ లైంగిక వేధింపులు..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
పానిపట్లో రాష్ట్ర మంత్రి మహిపాల్ దండా నివాసంలో ఈ సమావేశం జరిగిందని, జేజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఖట్టర్, మంత్రి ధండాతో భేటీ అయినట్లు తెలిసింది. ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఖట్టర్ వ్యాఖ్యానించినట్లు నిరాకరించారు. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ప్రస్తుత బలం 88 కాగా, అందులో బీజేపీకి 40 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.
ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణధీర్ సింగ్ గొల్లెన్, ధరంపాల్ గోండర్ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు నిలిపేయడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. గతంలో బీజేపీతో ప్రభుత్వంలో ఉన్న దుష్యంత్ సింగ్ చౌతాలా జేజేపీ లోక్సభ సీట్ల విషయంలో విభేదించి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. బీజేపీపై కోపంగా ఉన్న చౌతాలా ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి, ప్రభుత్వం మైనారిటీలో పడిండని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే మద్దతు అందిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చౌతాలా గవర్నర్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చౌతాలాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..