West Bengal: దీదీ కోటలో మళ్లీ హింస.. రాష్ట్రపతి పాలన ఒక్కటే మార్గం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో మరోసారి హింస జరిగింది.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది.. దీనిపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.. ఇక, ఇప్పుడు బీర్భూం జిల్లా రామ్పుర్ హాట్ రాజకీయ హింసపై, అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పట్టణ శివారులోని బోగ్టూయి గ్రామంలో ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై ఇద్దరు చిన్నారులతో పాటు ఎనిమిది మంది సజీవ దహనం కావడం విషాదం నింపింది. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్ బాదు షేక్ హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టీఎంసీ నేత హత్యకు ప్రతీకారంగానే ఇళ్లకు నిప్పుపెట్టినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. కానీ, వ్యక్తిగత కక్షల అనుమానంతో ఈ ఘటనలో 11 మందిని పోలీసులు అరెస్టు చెయ్యడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ముమ్మాటికీ రాజకీయ కక్షేనంటూ ఆరోపిస్తున్నాయి.
Read Also: Imran Khan: అవిశ్వాసం ముప్పు..! పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
ఇక, ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన కోల్కతా హైకోర్టు, మధ్యంతర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. రాంపూర్హట్ గ్రామంలో జిల్లా జడ్జి సమక్షంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. వెంటనే ఆధారాలు సేకరించాలని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీని ఆదేశించింది. బీర్భూం హింసపై ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్ అయ్యారు. అత్యంత హేయమైన ఘటనగా అభివర్ణించారు. హత్యాకాండలో నేరస్థుల్ని చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహకారాన్ని కేంద్రం అందిస్తుందన్నారు. ఈ ఘటన రాజకీయ రచ్చగా మారుతోంది. బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దోషులను కాపాడేందుకు మమతాబెనర్జీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలోనూ బీజేపీ ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు, బిమన్ బోస్ నేతృత్వంలో సీపీఎం నేతలు రాంపూర్హట్లో పర్యటించారు. ఘటనపై ఎన్ఐఏ లేదంటే సీబీఐ దర్యాప్తు చేయించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు. బెంగాల్ ను కాపాడేందుకు రాష్ట్రపతి పాలన ఒక్కటే పరిష్కారమని సువేందు వ్యాఖ్యానించారు. మరోవైపు.. బీజేపీ, వామపక్షాల ఆరోపణలు, విమర్శలపై ఘాటుగా స్పందించారు సీఎం మమతా బెనర్జీ. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ రేప్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తమవాళ్లు వెళ్తే అడ్డుకున్నారని… ఇక్కడ మాత్రం తామెవరినీ అడ్డుకోవడంలేదన్నారు. ఇవాళ ఘటనస్థలానికి వెళ్లనున్న మమత, దోషులెవరైనా విడిచిపెట్టేదిలేదన్నారు.
తాజావార్తలు
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?