All India Muslim Personal Law Board: ముస్లింలు టీవీ డిబేట్లలో పాల్గొన వద్దని కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ టీవీ డిబెట్ లో పాల్గొంటూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశంలో, విదేశాల్లో దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే ఖతార్, యూఏఈ, సౌదీ, మలేషియా, ఇరాక్ వంటి దేశాలు భారత్ కు తమ నిరసన తెలిపాయి. భారత విదేశాంగ శాఖ కూడా అంతే స్థాయిలో బదులిచ్చింది. ఇప్పటికే మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని.. వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వానికి ఆపాదించవద్దని హితవు పలికింది.
ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున శుక్రవారం రోజు ముస్లింలు ఆందోళన, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు దిగారు. యూపీ, ఢిల్లీ, హైదరాబాద్, రాంచీ ఇలా పలు చోట్ల ఆందోళన నిర్వహించారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ తో పాటు జార్ఖండ్ రాంచీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
ఈ వివాదం ఇలా ఉంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇస్లాం, ముస్లింలను అపహాస్యం చేయడానికి ఉద్దేశించిన వార్తా చర్చలలో పాల్గొనవద్దని కోరింది. అటువంటి ప్రదర్శనల్లో పాల్గొనడం వల్ల ముస్లింలకు, ఇస్లాంకు ఏ విధంగా సేవ చేయకపోవడమే కాకుండా.. ముస్లింలు, ఇస్లాంలు లక్ష్యంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానిచారు. ఈ టీవీ డిబేట్లు నిర్మాణాత్మక చర్చకు ఉపయోగపడేవి కావని..కేవలం ఇస్లాం, ముస్లింలను అపహాస్యం చేయడానికి మాత్రమే అని లా బోర్డ్ అభిప్రాయపడింది.
కేవలం టీవీ డిబేట్లలో న్యూస్ ఛానెల్స్ బ్యాలెన్సుడ్ గా ఉన్నామని చూపడానికి మాత్రేమే ముస్లిం ప్రముఖులను ఆహ్వానిస్తున్నాయని..మనం ఈ మోసానికి బలైపోతున్నామని.. మేము ఈ ప్రోగ్రామ్స్, ఛానెల్స్ ను బహిష్కరిస్తే సదరు టీవీ ఛానెళ్లు టీఆర్పీ కోల్పోవడమే కాకుండా.. వారి ప్రణాళికలు విఫలం అవుతాయని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అభిప్రాయపడింది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!