All India Muslim Personal Law Board: ముస్లింలు టీవీ డిబేట్లలో పాల్గొన వద్దని కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ టీవీ డిబెట్ లో పాల్గొంటూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశంలో, విదేశాల్లో దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే ఖతార్, యూఏఈ, సౌదీ, మలేషియా, ఇరాక్ వంటి దేశాలు భారత్ కు తమ నిరసన తెలిపాయి. భారత విదేశాంగ శాఖ కూడా అంతే స్థాయిలో బదులిచ్చింది. ఇప్పటికే మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని.. వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వానికి ఆపాదించవద్దని హితవు పలికింది.
ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున శుక్రవారం రోజు ముస్లింలు ఆందోళన, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు దిగారు. యూపీ, ఢిల్లీ, హైదరాబాద్, రాంచీ ఇలా పలు చోట్ల ఆందోళన నిర్వహించారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ తో పాటు జార్ఖండ్ రాంచీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
Also Read
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
ఈ వివాదం ఇలా ఉంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇస్లాం, ముస్లింలను అపహాస్యం చేయడానికి ఉద్దేశించిన వార్తా చర్చలలో పాల్గొనవద్దని కోరింది. అటువంటి ప్రదర్శనల్లో పాల్గొనడం వల్ల ముస్లింలకు, ఇస్లాంకు ఏ విధంగా సేవ చేయకపోవడమే కాకుండా.. ముస్లింలు, ఇస్లాంలు లక్ష్యంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానిచారు. ఈ టీవీ డిబేట్లు నిర్మాణాత్మక చర్చకు ఉపయోగపడేవి కావని..కేవలం ఇస్లాం, ముస్లింలను అపహాస్యం చేయడానికి మాత్రమే అని లా బోర్డ్ అభిప్రాయపడింది.
కేవలం టీవీ డిబేట్లలో న్యూస్ ఛానెల్స్ బ్యాలెన్సుడ్ గా ఉన్నామని చూపడానికి మాత్రేమే ముస్లిం ప్రముఖులను ఆహ్వానిస్తున్నాయని..మనం ఈ మోసానికి బలైపోతున్నామని.. మేము ఈ ప్రోగ్రామ్స్, ఛానెల్స్ ను బహిష్కరిస్తే సదరు టీవీ ఛానెళ్లు టీఆర్పీ కోల్పోవడమే కాకుండా.. వారి ప్రణాళికలు విఫలం అవుతాయని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అభిప్రాయపడింది.
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..