Supreme Court: అర్చకులు కావడానికి అన్ని కులాల వారూ అర్హులే: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: అర్చకులు కావడానికి అన్ని కులాల వారూ అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే వారు ఆగమశాస్త్ర నియమాల ప్రకారం అర్హత పొందిన వారై ఉండాల్సి ఉంటుంది. కోయిల్ ఆగమ నిబంధనలకు అర్హులైన ఎవరైనా పూజారి కావచ్చని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. సేలం సుఖవనేశ్వర్ ఆలయంలో పూజారి నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ 2018లో ఆలయ పాలకమండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ అదే ఆలయంలో పనిచేస్తున్న సుబ్రమణ్య గురువు మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. అందులో సుగణేశ్వరాలయం ఆగమానికి ఆధారమని, ఈ నోటీసులో పేర్కొన్న విశేషాలు ఆగమానికి ఆధారం కాదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఆలయ ఆగమ నియమాలు, పూజా విధానాల్లో ఉత్తీర్ణత పొందిన వారెవరైనా అర్చకులు కావచ్చని తీర్పునిచ్చారు. ఈ తీర్పునే మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సమర్ధించింది.
Read Also: CM KCR: నేడు కేసీఆర్ మెదక్ పర్యటన.. రూ.4016 పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం
Also Read
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుబ్రమణియ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తులు ఎంఎం సుందరేశన్, బాల్కీవాలాలతో కూడిన ధర్మాసనం ముందు మంగళవారం విచారణకు వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు ఆలయ ఆగమ నిబంధనలను ఆమోదించిన ఎవరైనా అర్చకులు కావచ్చని.. మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధృవీకరించి, సుబ్రహ్మణ్య గురువు పిటిషన్ను కొట్టివేసింది. అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చన్న మద్రాసు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి నిరాకరించింది. ఆగమ నియమాల ప్రకారం ఉత్తీర్ణత సాధించి తగిన శిక్షణ, పూజ చేయడానికి అర్హత పొందిన వారెవరైనా అర్చకులు కావచ్చని తెలిపింది.
గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్.. హిందూ ధార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు దేవాలయాల్లో దళితులతోపాటు అన్ని కులాలకు చెందిన 28 మందిని పూజారులుగా నియమించారు. దీనిపై దాఖలైన వ్యాజ్యంలో తీర్పునిచ్చిన మద్రాసు హైకోర్టు.. అర్చకుల నియామకానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం విధించిన నిబంధనలు వర్తిస్తాయని, ఆగమ నిబంధనల ప్రకారమే అర్చకులను నియమించాలని తీర్పునివ్వడం గమనార్హం. ఆగమ నియమాల ప్రకారం ఆలయాలు నిర్వహించబడతాయి.
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్మన్ గిల్ అవుట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!