Akhilesh Yadav: ఏపీ, బీహార్ రాష్ట్రాలకు బడ్జెట్ బొనాంజా.. అఖిలేష్ కీలక వ్యాఖ్యలు..
- కేంద్ర బడ్జెట్పై విమర్శలు గుప్పించిన అఖిలేష్ యాదవ్..
- మిత్రపక్షాలను తృప్తి పరిచేందుకు ఏపీ
- బీహార్లకు నిధులు..
- ఉత్తర్ ప్రదేశ్ని విస్మరించారని ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎన్డీయేలో మిత్రపక్షాలకే ఎక్కువ నిధులు కేటాయించినట్లు కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. దీంతో పాటు తమ మేనిఫేస్టో అంశాలనే బీజేపీ కాపీ కొట్టిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇదిలా ఉంటే, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా బడ్జెట్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీయేలోని మిత్రపక్షాలను అధికారంలో కొనసాగించేలా బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉత్తర్ ప్రదేశ్ని విస్మరించారని ఆయన అన్నారు.
Read Also: Sri Lanka: 9 మంది తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక
Also Read
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
- Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
- FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
మిత్రపక్షాలకు ప్యాకేజీలు ఇచ్చి అధికారంలో ఉండేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎన్డీయే మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకునేందుకు బడ్జెట్ ప్రయత్నమని అఖిలేష్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో మిత్ర పక్షాలైన టీడీపీ, జేడీయూలు పాలిస్తున్న ఏపీ, బీహార్ రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు కేటాయించగా, బీహార్లో రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులకు రూ.26,000 కోట్లు కేటాయించారు. ఉత్తర్ ప్రదేశ్కి బడ్జెట్లో ఏమీ రాలేదని అఖిలేష్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏం ప్రయోజనం కలగలేదని విమర్శించారు.
తాజావార్తలు
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!