Maharashtra: న్యూఇయర్ వేళ పవార్ల కుటుంబాల్లో కొత్త మార్పు! మళ్లీ ఒక్కటైపోతున్నారా?
- న్యూఇయర్ వేళ పవార్ల కుటుంబాల్లో కొత్త మార్పు!
- రంగంలోకి దిగిన అజిత్ పవార్ తల్లి ఆశాతై
- తిరిగి ఒక్కటి కావాలన్నా పిలుపునకు అంగీకారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన సంవత్సరంలో మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. నిన్నామొన్నటిదాకా విడివిడిగా ఉన్న అజిత్ పవార్-శరద్ పవార్ కుటుంబాలు మళ్లీ ఒక్కటి కాబోతున్నాయన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు అజిత్ పవార్ తల్లి ఆశాతై రాయబారిగా మారి సయోధ్య కుదిర్చినట్లుగా తెలుస్తోంది. నూతన సంవత్సర వేళ ఆశాతై.. అజిత్ పవార్కు ఫోన్ చేసి.. కుటుంబ విభేదాలకు ఫుల్స్టాప్ పెట్టి కలిసిపోవాలని విజ్ఞప్తి చేసింది. దీంతో ఇరు కుటుంబాలు అంగీకరించడంతో తిరిగి కలిసిపోయేందుకు సిద్ధమైయినట్లు సమాచారం.
ఇక అజిత్ పవార్ తల్లి ఆశాతై మాట్లాడుతూ.. కుటుంబ కలహాలకు ముగింపు పలకాలని పవార్ల కుటుంబాలకు పిలుపునిచ్చారు. కుటుంబ కలహాలు పరిష్కారం అవుతాయని.. తిరిగి ఇరు కుటుంబాలు కలిసి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అజిత్ పవార్-శరద్ పవార్ తిరిగి కలిసి కోవాలని ప్రార్థించానని.. తన ప్రార్థనలు నెరవేరుతాయని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇరు కుటుంబాల్లో సయోధ్య కుదిరినట్లుగా ఆమె వ్యాఖ్యలతో అర్థమవుతోంది. త్వరలోనే ఇరు కుటుంబాలు కలవబోతున్నట్లు సమాచారం.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
డిసెంబరు 12న శరద్ పవార్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఢిల్లీలో ఉన్న శరద్ పవార్ ఇంటికి అనూహ్యంగా అజిత్ పవార వెళ్లారు. బర్త్ డే విషెస్ చెప్పి.. చాలా సేపు ఐక్యంగా కూర్చుని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే ఇరు కుటుంబాల మధ్య సయోధ్య జరిగినట్లుగా సమాచారం. దీంతో కొత్త సంవత్సరం వేళ్ల మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
శరద్ పవార్ తండ్రితో సమానమని ఎన్సీపీ సీనియర్ నాయకుడు ప్రపుల్ పటేల్ అన్నారు. రాజకీయాలు భిన్నమైనప్పటికీ.. ఆయనంటే అపారమైన గౌరవం ఉందని చెప్పారు. పవార్ కుటుంబం తిరిగి కలిస్తే చాలా సంతోషిస్తామని చెప్పారు. పవార్ కుటుంబంలో తాను కూడా ఒక భాగమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇరు కుటుంబాల కలయికపై కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2023లో అజిత్ పవార్.. ఎన్సీపీలోని కొంత మంది ఎమ్మెల్యేలను తీసుకుని… శివసేన-బీజేపీ కూటమిలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహాయుతితో కలిసే పోటీ చేశారు. అయితే ఈ మధ్య మహాయుతిలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇందులో భాగంగానే తిరిగి ఎన్సీపీ నేతలంతా ఒక్కటి కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఒక తల్లి చేసిన ప్రయత్నంతో రెండు కుటుంబాలు ఒక్కటి కాబోతుండడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!