Maharashtra: న్యూఇయర్ వేళ పవార్ల కుటుంబాల్లో కొత్త మార్పు! మళ్లీ ఒక్కటైపోతున్నారా?
- న్యూఇయర్ వేళ పవార్ల కుటుంబాల్లో కొత్త మార్పు!
- రంగంలోకి దిగిన అజిత్ పవార్ తల్లి ఆశాతై
- తిరిగి ఒక్కటి కావాలన్నా పిలుపునకు అంగీకారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన సంవత్సరంలో మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. నిన్నామొన్నటిదాకా విడివిడిగా ఉన్న అజిత్ పవార్-శరద్ పవార్ కుటుంబాలు మళ్లీ ఒక్కటి కాబోతున్నాయన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు అజిత్ పవార్ తల్లి ఆశాతై రాయబారిగా మారి సయోధ్య కుదిర్చినట్లుగా తెలుస్తోంది. నూతన సంవత్సర వేళ ఆశాతై.. అజిత్ పవార్కు ఫోన్ చేసి.. కుటుంబ విభేదాలకు ఫుల్స్టాప్ పెట్టి కలిసిపోవాలని విజ్ఞప్తి చేసింది. దీంతో ఇరు కుటుంబాలు అంగీకరించడంతో తిరిగి కలిసిపోయేందుకు సిద్ధమైయినట్లు సమాచారం.
ఇక అజిత్ పవార్ తల్లి ఆశాతై మాట్లాడుతూ.. కుటుంబ కలహాలకు ముగింపు పలకాలని పవార్ల కుటుంబాలకు పిలుపునిచ్చారు. కుటుంబ కలహాలు పరిష్కారం అవుతాయని.. తిరిగి ఇరు కుటుంబాలు కలిసి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అజిత్ పవార్-శరద్ పవార్ తిరిగి కలిసి కోవాలని ప్రార్థించానని.. తన ప్రార్థనలు నెరవేరుతాయని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇరు కుటుంబాల్లో సయోధ్య కుదిరినట్లుగా ఆమె వ్యాఖ్యలతో అర్థమవుతోంది. త్వరలోనే ఇరు కుటుంబాలు కలవబోతున్నట్లు సమాచారం.
Also Read
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
డిసెంబరు 12న శరద్ పవార్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఢిల్లీలో ఉన్న శరద్ పవార్ ఇంటికి అనూహ్యంగా అజిత్ పవార వెళ్లారు. బర్త్ డే విషెస్ చెప్పి.. చాలా సేపు ఐక్యంగా కూర్చుని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే ఇరు కుటుంబాల మధ్య సయోధ్య జరిగినట్లుగా సమాచారం. దీంతో కొత్త సంవత్సరం వేళ్ల మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
శరద్ పవార్ తండ్రితో సమానమని ఎన్సీపీ సీనియర్ నాయకుడు ప్రపుల్ పటేల్ అన్నారు. రాజకీయాలు భిన్నమైనప్పటికీ.. ఆయనంటే అపారమైన గౌరవం ఉందని చెప్పారు. పవార్ కుటుంబం తిరిగి కలిస్తే చాలా సంతోషిస్తామని చెప్పారు. పవార్ కుటుంబంలో తాను కూడా ఒక భాగమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇరు కుటుంబాల కలయికపై కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2023లో అజిత్ పవార్.. ఎన్సీపీలోని కొంత మంది ఎమ్మెల్యేలను తీసుకుని… శివసేన-బీజేపీ కూటమిలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహాయుతితో కలిసే పోటీ చేశారు. అయితే ఈ మధ్య మహాయుతిలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇందులో భాగంగానే తిరిగి ఎన్సీపీ నేతలంతా ఒక్కటి కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఒక తల్లి చేసిన ప్రయత్నంతో రెండు కుటుంబాలు ఒక్కటి కాబోతుండడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!