Maharashtra: న్యూఇయర్ వేళ పవార్ల కుటుంబాల్లో కొత్త మార్పు! మళ్లీ ఒక్కటైపోతున్నారా?
- న్యూఇయర్ వేళ పవార్ల కుటుంబాల్లో కొత్త మార్పు!
- రంగంలోకి దిగిన అజిత్ పవార్ తల్లి ఆశాతై
- తిరిగి ఒక్కటి కావాలన్నా పిలుపునకు అంగీకారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన సంవత్సరంలో మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. నిన్నామొన్నటిదాకా విడివిడిగా ఉన్న అజిత్ పవార్-శరద్ పవార్ కుటుంబాలు మళ్లీ ఒక్కటి కాబోతున్నాయన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు అజిత్ పవార్ తల్లి ఆశాతై రాయబారిగా మారి సయోధ్య కుదిర్చినట్లుగా తెలుస్తోంది. నూతన సంవత్సర వేళ ఆశాతై.. అజిత్ పవార్కు ఫోన్ చేసి.. కుటుంబ విభేదాలకు ఫుల్స్టాప్ పెట్టి కలిసిపోవాలని విజ్ఞప్తి చేసింది. దీంతో ఇరు కుటుంబాలు అంగీకరించడంతో తిరిగి కలిసిపోయేందుకు సిద్ధమైయినట్లు సమాచారం.
ఇక అజిత్ పవార్ తల్లి ఆశాతై మాట్లాడుతూ.. కుటుంబ కలహాలకు ముగింపు పలకాలని పవార్ల కుటుంబాలకు పిలుపునిచ్చారు. కుటుంబ కలహాలు పరిష్కారం అవుతాయని.. తిరిగి ఇరు కుటుంబాలు కలిసి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అజిత్ పవార్-శరద్ పవార్ తిరిగి కలిసి కోవాలని ప్రార్థించానని.. తన ప్రార్థనలు నెరవేరుతాయని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇరు కుటుంబాల్లో సయోధ్య కుదిరినట్లుగా ఆమె వ్యాఖ్యలతో అర్థమవుతోంది. త్వరలోనే ఇరు కుటుంబాలు కలవబోతున్నట్లు సమాచారం.
Also Read
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
డిసెంబరు 12న శరద్ పవార్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఢిల్లీలో ఉన్న శరద్ పవార్ ఇంటికి అనూహ్యంగా అజిత్ పవార వెళ్లారు. బర్త్ డే విషెస్ చెప్పి.. చాలా సేపు ఐక్యంగా కూర్చుని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే ఇరు కుటుంబాల మధ్య సయోధ్య జరిగినట్లుగా సమాచారం. దీంతో కొత్త సంవత్సరం వేళ్ల మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
శరద్ పవార్ తండ్రితో సమానమని ఎన్సీపీ సీనియర్ నాయకుడు ప్రపుల్ పటేల్ అన్నారు. రాజకీయాలు భిన్నమైనప్పటికీ.. ఆయనంటే అపారమైన గౌరవం ఉందని చెప్పారు. పవార్ కుటుంబం తిరిగి కలిస్తే చాలా సంతోషిస్తామని చెప్పారు. పవార్ కుటుంబంలో తాను కూడా ఒక భాగమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇరు కుటుంబాల కలయికపై కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2023లో అజిత్ పవార్.. ఎన్సీపీలోని కొంత మంది ఎమ్మెల్యేలను తీసుకుని… శివసేన-బీజేపీ కూటమిలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహాయుతితో కలిసే పోటీ చేశారు. అయితే ఈ మధ్య మహాయుతిలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇందులో భాగంగానే తిరిగి ఎన్సీపీ నేతలంతా ఒక్కటి కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఒక తల్లి చేసిన ప్రయత్నంతో రెండు కుటుంబాలు ఒక్కటి కాబోతుండడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!