Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్
- ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు
- అలాంటి దేశాలపై కఠిన చర్యలుండాలి
- మాస్కో వేదికగా అజిత్ దోవల్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగ్రవాదంపై పోరాటంలో దేశాలు ద్వంద్వ వైఖరి అవలంబించకూడదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే నిధులు సమకూర్చే దేశాలపై బాధ్యతాయుతమైన దేశాలు కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మాస్కోలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ భద్రతా ఫోరం, భద్రతా వ్యవహారాలకు బాధ్యత వహిస్తున్న ఉన్నతాధికారుల 14వ అంతర్జాతీయ సమావేశంలో అజిత్ దోవల్ పాల్గొని ప్రసంగించారు.

Also Read
- Trump Immigration: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారంటే!
- PM Modi: యూకే కొత్త ప్రధానికి మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే!
- PM Modi: ‘తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు’.. తప్పుదారి పట్టిన యువతకు సరైన మార్గం చూపాలి.. ప్రధాని మోడీ కొత్త వీడియో..
- Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
“ప్రతి దేశానికీ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే బాధ్యత ఉంది. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదు. బాధ్యతగల దేశాలు తమ వైఖరిని స్పష్టం చేయాలి. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల వెంట నిలుస్తాయా? లేక ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటాయా? అన్నది తేల్చుకోవాలి” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా 2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని దోవల్ ప్రస్తావించారు. భారత్ ఎన్నాళ్లుగానో ప్రభుత్వ ప్రోత్సాహంతో నడిచే ఉగ్రవాదానికి బలవుతోందని అన్నారు. “2025 ఏప్రిల్లో ప్రపంచం దారుణ ఘటనను చూసింది. జమ్మూకాశ్మీర్లో 26 మంది అమాయక పౌరులను, వారి కుటుంబాల ముందే హత్య చేశారు. మతం ఆధారంగా వారిని వేరు చేసి చంపారు” అని తెలిపారు.
దోషులపై భారత్ కఠిన చర్యలు
ఉగ్రదాడి అనంతరం దోషులపై భారత్ కఠిన చర్యలు తీసుకుందని దోవల్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) చేసిన ప్రకటనను భారత్ సమర్థిస్తోందన్నారు. “ఉగ్రదాడులకు పాల్పడినవారు, కుట్రదారులు, నిధులు సమకూర్చినవారు, మద్దతుదారులందరినీ బాధ్యులుగా నిలబెట్టి శిక్షించాలన్న UNSC అభిప్రాయాన్ని భారత్ పూర్తిగా సమర్థిస్తోంది. అదే నేపథ్యంలో పహల్గామ్ దాడి నిందితులపై భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది” అని తెలిపారు.
ప్రపంచ రాజకీయాల్లో మార్పులు
ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై కూడా దోవల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం భౌగోళిక, ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటోందని చెప్పారు. యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో సవాళ్లు ప్రపంచ సమీకరణాలను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. “ప్రపంచ శక్తి ఇప్పుడు కొద్ది దేశాల చేతుల్లో మాత్రమే లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఆర్థిక, సైనిక సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. గ్లోబల్ సౌత్ దేశాలకు సమాన భాగస్వామ్యం లభించేలా బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థ ఏర్పడుతోంది. అదే ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మార్గం” అని పేర్కొన్నారు.
మే 26 నుంచి 29 వరకు మాస్కోలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమావేశంలో 140కిపైగా దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. భద్రతా మండళ్ల కార్యదర్శులు, జాతీయ భద్రతా సలహాదారులు, నిఘా సంస్థల ఉన్నతాధికారులు ఈ వేదికపై చర్చలు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Preethizinta : ఎనిమిదేళ్ల విరామం తర్వాత బిగ్ స్క్రీన్పై ప్రీతి జింటా
-
Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
-
Ramayan: ‘రామాయణం’లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
-
Tecno 0mm Bezel Smartphone: స్క్రీన్ చుట్టూ బెజెల్స్ మాయం! 0mm డిస్ప్లే బోర్డర్తో టెక్నో కొత్త కాన్సెప్ట్ ఫోన్
-
RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!