Ajit Doval: రష్యా ముందుకు ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక.. పుతిన్తో అజిత్ దోవల్ భేటీ..
- రష్యా అధ్యక్షుడు పుతిన్తో అజిత్ దోవల్ భేటీ..
- ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక రష్యా అధినేత ముందుకు..
- వచ్చే నెలలో బ్రిక్స్ సమావేశానికి మోడీ హాజరవుతారని పుతిన్ ఆశాభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Doval: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. పుతిన్తో దోవల్ కరచాలనం చేసిన చిత్రాలను భారతదేశంలోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్లో ట్వీట్ చేసింది. ఉక్రెయిన్లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ముగిసిన రెండు వారాల తర్వాత అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లారు.
Read Also: Russia: రష్యన్ ఆర్మీలో చేరిన 45 మంది భారతీయులకు విముక్తి.. మరో 50 మందిని రక్షించే ప్రయత్నం..
Also Read
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి నెలకొనేలా ‘పీస్ ప్లాన్’ కోసం దోవల్ రష్యా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోడీ తన ఉక్రెయిన్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జెలన్స్కీతో చర్చలు జరిపారు. యుద్ధం ముగించడానికి రెండు దేశాలు కూడా కలిసి మాట్లాడుకోవాలని, దౌత్యం, చర్యలతో సమస్య పరిష్కరించుకోవాలని, శాంతి పునరుద్ధరణకు భారత్ క్రియాశీలక పాత్ర పోషించడానికి సద్ధంగా ఉందని చెప్పారు.
దోవల్ రష్యా పర్యటన శాంతి చర్చల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన భేటీలో ఈ శాంతి ప్రణాళికను పుతిన్ వద్దకు తీసుకెళ్లారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వార్షిక బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చే నెలలో రష్యాలోని కజాన్కి ప్రధాని మోడీ వస్తారనే ఆశాభావాన్ని పుతిన్ వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా అక్టోబర్ 22న ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని పుతిన్ ప్రతిపాదించారు. ‘‘ మేము మా మంచి స్నేహితుడు మోడీ కోసం ఎదురుచూస్తున్నాం. ఆయనకు శుభాకాంక్షలు’’ అని రష్యా మీడియా సమావేశంలో పుతిన్ చెప్పినట్లు రష్యన్ ఎంబసీ పేర్కొంది.
🇷🇺🤝🇮🇳 On September 12, #Russia's President Vladimir Putin had a meeting with Ajit Doval, National Security Advisor to the Prime Minister of #India, at the Konstantinovsky Palace in #StPetersburg.
👉🏻 https://t.co/vFQ64S4vMq#RussiaIndia #DruzhbaDosti pic.twitter.com/KxcD9aciDG
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) September 12, 2024
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!