Air India Plane Crash: మేడే, మేడే.. ప్రమాదం ముందు ఏటీసీకి చివరి సందేశం..
- కుప్పకూలిని అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం..
- ప్రమాద సమయంలో విమానంలో 242 మంది..
- టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ప్రమాదం..
- చివరిసారిగా ‘‘మేడే మేడే’’ సందేశాన్ని ఏటీసీకి పంపిన కో పైలెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Plane Crash: అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే విమానం కుప్పకూలింది. విమానం వేగంగా తన ఎత్తును కోల్పోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాదం సమయంలో విమానం 825 అడుగుల నుంచి కుప్పకూలింది. విమానం నేలను ఢీ కొట్టడంతో వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
అయితే, విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే సిగ్నల్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే పైలట్లు అత్యవసర సందేశం ‘‘మేడే మేడే’’ అని అహ్మదాబాద్ ఏటీసీని మేసేజ్ పంపించారు. ఇది జరిగిన తర్వాత రేడియో ఆఫ్ అయిపోయింది. కో-పైలెట్ ఏటీసీకి మేడే కాల్ చేశారని, కానీ ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పౌర విమానయాన డైరెక్టరేట్ (DGCA) ధృవీకరించింది.
Also Read
- IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
Read Also: Air India Plane Crash: 100 మందికి పైగా మృతి.? టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే సిగ్నల్ లాస్ట్..
“విమానంలో 242 మంది ఉన్నారు, వీరిలో 2 పైలట్లు మరియు 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఈ విమానం కెప్టెన్గా సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుందర్ ఉన్నారు కెప్టెన్ సుమీత్ సభర్వాల్ 8200 గంటల అనుభవం కలిగిన ఉన్నారు. కోపైలట్కు 1100 గంటల విమానయాన అనుభవం ఉంది. ఏటీసీ ప్రకారం, విమానం అహ్మదాబాద్ నుండి సమయం1339 IST (0809 UTC) వద్ద రన్వే 23 నుండి బయలుదేరింది” అని ప్రకటనలో పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి సమీక్షించారు. అవసరమైన అన్ని సహాయాన్ని వెంటనే అందించాలని మరియు పరిస్థితిపై క్రమం తప్పకుండా నవీకరించాలని మంత్రిని కోరారు. మరోవైపు, అహ్మదాబాద్ ఎయిర్ పోర్టును మూసేశారు.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!