Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో ఒకే రన్వేపై రెండు విమానాలు.. వందలాది మంది ప్రయాణికులు చావు అంచుల వరకు..
- ముంబై విమానాశ్రయంలో ఒకే రన్వేపై రెండు విమానాలు
- ATC అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Airport Runway Incident: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి పెను విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఒకే రన్వేపై రెండు విమానాలు ఉండటంతో ప్రమాదకర పరిస్థితి నెలకొన్నప్పటికీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు, పైలట్ల అప్రమత్తతతో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు సురక్షితంగా నిలిచాయి.
ఎలా జరిగింది?
అందిన సమాచారం ప్రకారం, పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నుంచి ముంబైకి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం (AIX1547 – Boeing 737 MAX 8) రాత్రి ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే ల్యాండింగ్ అనంతరం ఆ విమానం ఇంకా రన్వేను పూర్తిగా ఖాళీ చేయలేదు. అదే సమయంలో, ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం (AI816 – Boeing 777-300) అదే రన్వేపై టేకాఫ్ కోసం వేగాన్ని పెంచడం ప్రారంభించింది. దీంతో రెండు విమానాలు ఒకే రన్వేపై ఉండటంతో ప్రమాద పరిస్థితి ఏర్పడింది.
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ATC అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
రెండు విమానాలు ఒకే రన్వేపై ఉన్నాయని గుర్తించిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెంటనే స్పందించారు. టేకాఫ్కు సిద్ధమవుతున్న ఎయిర్ ఇండియా విమానం పైలట్కు తక్షణమే టేకాఫ్ను రద్దు చేయాలని సూచించారు. ఏటీసీ సూచన అందుకున్న వెంటనే పైలట్ విమానం వేగాన్ని తగ్గించి, టేకాఫ్ను నిలిపివేసి సురక్షితంగా విమానాన్ని పార్కింగ్ బే వైపు మళ్లించాడు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏటీసీ సూచనలు అందిన వెంటనే విమాన సిబ్బంది టేకాఫ్ను నిలిపివేశారని, విమానాన్ని సురక్షితంగా తిరిగి ల్యాండింగ్ బేకు తీసుకెళ్లారని తెలిపింది. అలాగే, సంస్థ ప్రామాణిక నిర్వహణ విధానాల (SOPs) ప్రకారం విమానానికి సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఈ ఘటనతో ఢిల్లీకి వెళ్లాల్సిన ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఎయిర్ ఇండియా మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రభావిత ప్రయాణికులను వీలైనంత త్వరగా గమ్యస్థానానికి తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు సంస్థ పేర్కొంది.
వందలాది ప్రాణాలు కాపాడిన సమయస్ఫూర్తి
ఏటీసీ అధికారులు, పైలట్ల సమయస్ఫూర్తితో స్పందించకపోయి ఉంటే, ఒకే రన్వేపై రెండు భారీ విమానాలు ఉండటంతో ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. వారి అప్రమత్తత కారణంగా వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు సురక్షితంగా నిలిచాయి.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!