Air India Express: యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ మార్గదర్శకాలు జారీ
Air India Express Issues Covid Guidelines For Travellers From UAE To India: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ భయాలు నెలకొన్నాయి. చైనాలో భారీగా కేసులు, మరణాలు నమోదు అవుతుండటంతో పలు ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్ ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. టెస్టింగ్- ట్రేసింగ్- ట్రీట్మెంట్ ఫార్ములాతో ముందుకెళ్లాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు.
Read Also: Russia: యూరోపియన్ దేశాలకు పుతిన్ షాక్.. ఇక ఆ దేశాలకు ఇంధన కష్టాలు..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇదిలా ఉంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి భారతదేశానికి ప్రయాణించే ప్రయాణికులకు కోవిడ్ మార్గదర్శకాలు జారీ చేసింది ప్రముఖ ఎయిర్ లైన్ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. కోవిడ్ కు వ్యాక్సినేషన్ వేయించుకుని ఇమ్యూనిటీ పొందాలని సిఫారసు చేసింది. ప్రయానికలు ప్రయాణించేటప్పుడు తప్పకుండా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని సూచించింది. 12 ఏళ్ల లోపు పిల్లకలు పోస్ట్-అరైవల్ పరీక్షలు అవసరం లేదని తెలిపింది. అయితే పిల్లలకు ఎలాంటి లక్షణాలు కనిపించానా.. వారు ప్రోటోకాల్ కు అనుగునంగా పరీక్షలు చేయించుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
దేశంలో కోవిడ్ ముందుజాగ్రత్తలో భాగంగా అంతర్జాతీయ విమానాల్లో వచ్చే ప్రయాణీకుల్లో రెండు శాతం మందికి ర్యాండమ్ టెస్టులు చేయాలని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఒక వేళ పాజిటివ్ రిజల్ట్స్ వస్తే వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని సూచించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, యూఎస్ఏతో సహా వివిధ దేశాల్లో ఇటీవలి కాలంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులలో ప్రభుత్వం ర్యాండమ్ గా ఆర్టీపీసీఆర్ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గతవారం లోక్ సభలో తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ కొచ్చి కేంద్రంగా మిడిల్ ఈస్ట్ కు ఎయిర్ లైన్ సేవలను అందిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!