Yunus Shaikh: “ముంబ్రాకు ఆకుపచ్చగా మారుస్తాం”.. క్షమాపణలు చెప్పిన ఎంఐఎం కార్పొరేటర్..
- ‘‘ముంబ్రాను ఆకుపచ్చగా మారుస్తాం’’..
- ఎంఐఎం కార్పొరేటర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..
- విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పిన సహర్ యూనస్ షేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yunus Shaikh:ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచింది. ఇదే కాకుండా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, మాలేగావ్, నాందేడ్, అమరావతి, ధులే, షోలాపూర్, నాగ్పూర్, థానే మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఎంఐఎం సత్తా చటాటింది. మొత్తంగా మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 125 స్థానాలను గెలుచుకుంది. ఈ గెలుపుపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ గెలుపు తర్వాత ఎంఐఎం ఒక వివాదంలో ఇరుక్కుంది. కొన్ని రోజుల క్రితం ఎంఐఎం కార్పొరేటర్ సహర్ యూనస్ షేక్ వివాదాస్పదలు చేశారు. ‘‘ముంబ్రాను ఆకుపచ్చగా మార్చాలి’’ అనే వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ముంబ్రా పోలీస్ స్టేషన్లో ఆమె లిఖితపూర్వకంగా క్షమాపణ పత్రాన్ని సమర్పించారు. తాను త్రివర్ణ పతాకానికి విధేయత చూపుతానని చెప్పింది.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ఆమె చేసిన వ్యాఖ్యలపై రెండు సార్లు పోలీస్ స్టేషన్కు పిలిపించినట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ అనిల్ షిండే చెప్పారు. ఆమె తన ప్రకటనలకు క్షమాపణ చెప్పిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు ఆమె క్షమాపణల్ని అంగీకరించినప్పటికీ, మళ్లీ ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముంబ్రా పోలీసులకు చేసిన భావోద్వేగ ప్రకటనలో..‘నేను మన త్రివర్ణ పతాకం కోసమే జీవిస్తాను, మరణిస్తాను’’ అని దేశ జాతీయ గుర్తింపును తాను ఎప్పటికీ అగౌరవపరచనని చెప్పింది.
అయితే, ఈమె క్షమాపణలతో బీజేపీ నేత కిరిట్ సోమస్య సంతృప్తి చెందలేదు. ఆమె వయసు 22 ఏళ్లే అని, ఈ సంఘటనను నిశితమైన రాజకీయ వ్యూహంలో భాగమని అభివర్ణించారు. దీని వెనక పెద్ద కుట్ర ఉందని, ఇది ఓట్ జిహాద్ అంటూ హెచ్చరించారు. ముంబైపై కన్నేసిన ఎంఐఎం, ఇతర ప్రాంతాల్లో ఈ వ్యూహాలను పరీక్షిస్తోందని ఆరోపించారు. దీనిని తాము జరగనిచ్చేది లేదని చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!