Congress: రేపటినుంచి అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!
- రేపటినుంచి అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు
- హాజరుకానున్న సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గే
- కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక సమావేశాలు జరగనున్నాయి. మంగళ, బుధవారాల్లో జరిగే సమావేశాల్లో.. మూలాల నుంచి పార్టీని పునరుద్ధరణ చేసే లక్ష్యంగా నేతలంతా సమాలోచనలు చేయనున్నారు. 64 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్లో సమావేశాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1938లో గుజరాత్లోని బర్దోలిలో, 1961లో భావనగర్లో ఏఐసీసీ సమావేశాలు జరిగాయి.
తాజా సమావేశాలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, ఏఐసీసీ కార్యనిర్వాహకవర్గ సభ్యులు, సీనియర్ నేతలంతా హాజరుకానున్నారు. ఇక తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ హాజరున్నారు.
Also Read
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్లో ఎదురయ్యే పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ సమావేశాల్లో కార్యాచరణ రూపొందించనున్నారు. గతేడాది డిసెంబర్ 26, 27 తేదీల్లో కర్ణాటకలోని బెలగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో మహాత్మాగాంధీ జన్మించిన గుజరాత్లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రేపటి నుంచి అహ్మదాబాద్లో సమావేశాలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: MP Mithun Reddy: నేడు సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ..
ఇదిలా ఉంటే త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలన్న లక్ష్యంతో వ్యూహ రచనలు చేయనున్నారు. ఆత్మ విశ్వాసంతో పార్టీ శ్రేణులను ఎలా పురికొల్పాలన్న లక్ష్యంగా సమాలోచనలు చేయనున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే ఢిల్లీలో రాష్ట్రాలవారీగా డీసీసీ అధ్యక్షుల సమావేశాలను అధిష్టానం వరుసగా నిర్వహించింది. ఈ ఏడాది చివరిలో బీహార్లో.. వచ్చే ఏడాది తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2027లో పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 2028లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అంతిమంగా 2029లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణపై తీవ్ర కసరత్తు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: What Today: ఈరోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!