Congress: రేపటినుంచి అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!
- రేపటినుంచి అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు
- హాజరుకానున్న సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గే
- కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక సమావేశాలు జరగనున్నాయి. మంగళ, బుధవారాల్లో జరిగే సమావేశాల్లో.. మూలాల నుంచి పార్టీని పునరుద్ధరణ చేసే లక్ష్యంగా నేతలంతా సమాలోచనలు చేయనున్నారు. 64 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్లో సమావేశాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1938లో గుజరాత్లోని బర్దోలిలో, 1961లో భావనగర్లో ఏఐసీసీ సమావేశాలు జరిగాయి.
తాజా సమావేశాలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, ఏఐసీసీ కార్యనిర్వాహకవర్గ సభ్యులు, సీనియర్ నేతలంతా హాజరుకానున్నారు. ఇక తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ హాజరున్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్లో ఎదురయ్యే పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ సమావేశాల్లో కార్యాచరణ రూపొందించనున్నారు. గతేడాది డిసెంబర్ 26, 27 తేదీల్లో కర్ణాటకలోని బెలగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో మహాత్మాగాంధీ జన్మించిన గుజరాత్లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రేపటి నుంచి అహ్మదాబాద్లో సమావేశాలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: MP Mithun Reddy: నేడు సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ..
ఇదిలా ఉంటే త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలన్న లక్ష్యంతో వ్యూహ రచనలు చేయనున్నారు. ఆత్మ విశ్వాసంతో పార్టీ శ్రేణులను ఎలా పురికొల్పాలన్న లక్ష్యంగా సమాలోచనలు చేయనున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే ఢిల్లీలో రాష్ట్రాలవారీగా డీసీసీ అధ్యక్షుల సమావేశాలను అధిష్టానం వరుసగా నిర్వహించింది. ఈ ఏడాది చివరిలో బీహార్లో.. వచ్చే ఏడాది తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2027లో పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 2028లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అంతిమంగా 2029లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణపై తీవ్ర కసరత్తు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: What Today: ఈరోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..