Agni-V: అగ్ని-5 క్షిపణి రేంజ్ పెరిగింది.. ఇక చైనాకు చుక్కలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agni-V weight reduced, can now strike targets beyond 7,000 km: భారతదేశ ప్రతిష్టాత్మక బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 సామర్థ్యం మరింగా పెరిగింది. అగ్ని-5 బరువును గణనీయంగా తగ్గించడం వల్ల క్షిపణి మరింత దూరం ప్రయాణించేందుకు వీలు కలిగింది. ప్రస్తుతం అగ్ని-5 ఏకంగా 7000 కిలోమీటర్ల దూరంలోకి లక్ష్యాలను సునాయాసంగా సాధించగలదు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) క్షిపణి బరువును 20 శాతం తగ్గించడం వల్ల అగ్ని-5 రేంజ్ ను 5000 కిలోమీటర్ల నుంచి 7000 కిలోమీటర్లకు పెరిగింది. క్షిపణిలో స్టీల్ కంటెంట్ తగ్గించడంతో పాటు వాటిని తేలికైన మిశ్రమ లోహాలతో భర్తీ చేయడం వల్ల అగ్ని-5 రేంజ్ పెరిగినట్లు రక్షణ రంగ అధికారులు ప్రకటించారు. 20 శాతం బరువు తగ్గించడం వల్ల అగ్ని-5 అణు సామర్థ్య వార్ హెడ్ లతో 7000 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
Read Also: Quick Pregnancy : ప్రెగ్నెన్సీ తొందరగా రావాలంటే ఏం చెయ్యాలి? ఏ టైం లో కలవాలి?
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
అగ్ని క్షిపణుల సిరీస్ లో అగ్ని-3 దాదాపుగా 40 టన్నుల బరువుతో 3000 కిలోమీటర్లు లక్ష్యాలను ఛేదించగలదు. అయితే అగ్ని 4 క్షిపణి అగ్ని-3 కన్నా 20 టన్నుల బరువు తక్కువగా ఉంటుంది. ఇది ఏకంగా 4000 కిలోమీటర్ల వరకు వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అయితే ఇప్పడు అగ్ని-5 గరిష్ట పరిమితి 5000 కిలోమీటర్లు అయినా.. బరువు తగ్గించడం వల్ల 7000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అవలీలగా చేధించగలదు. దీంతో యావత్ ఆసియా ఖండం మొత్తం అగ్ని-5 పరిధిలోకి వస్తుంది. అండమాన్ నికోబార్ కేంద్రంగా చూసుకుంటే ఆస్ట్రేలియా కూడా ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది.
రెండు రోజుల క్రితం అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది రక్షణ శాఖ. రాత్రిపూట ఈ ప్రయోగాన్ని విజయవంతంగా జరిపింది. గతంలో పోలిస్తే అగ్ని-5లో సాంకేతికత పెరిగింది. మూడు దశల్లో ఘన ఇంజన్లు క్షిపణికి చోధక శక్తిని ఇస్తాయి. అత్యంత ఖచ్చితత్వంతో ఇది టార్గెట్లను హిట్ చేయగలుగుతుంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్లను దృష్టిలో పెట్టుకుని భారత్ తన క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తోంది. అయితే ‘ నో ఫస్ట్ యూజ్’ అనే సొంత నియమానికి కట్టుబడి భారత క్షిపణి విధానం ఉంది.
తాజావార్తలు
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!