Agni-V: అగ్ని-5 క్షిపణి రేంజ్ పెరిగింది.. ఇక చైనాకు చుక్కలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agni-V weight reduced, can now strike targets beyond 7,000 km: భారతదేశ ప్రతిష్టాత్మక బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 సామర్థ్యం మరింగా పెరిగింది. అగ్ని-5 బరువును గణనీయంగా తగ్గించడం వల్ల క్షిపణి మరింత దూరం ప్రయాణించేందుకు వీలు కలిగింది. ప్రస్తుతం అగ్ని-5 ఏకంగా 7000 కిలోమీటర్ల దూరంలోకి లక్ష్యాలను సునాయాసంగా సాధించగలదు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) క్షిపణి బరువును 20 శాతం తగ్గించడం వల్ల అగ్ని-5 రేంజ్ ను 5000 కిలోమీటర్ల నుంచి 7000 కిలోమీటర్లకు పెరిగింది. క్షిపణిలో స్టీల్ కంటెంట్ తగ్గించడంతో పాటు వాటిని తేలికైన మిశ్రమ లోహాలతో భర్తీ చేయడం వల్ల అగ్ని-5 రేంజ్ పెరిగినట్లు రక్షణ రంగ అధికారులు ప్రకటించారు. 20 శాతం బరువు తగ్గించడం వల్ల అగ్ని-5 అణు సామర్థ్య వార్ హెడ్ లతో 7000 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
Read Also: Quick Pregnancy : ప్రెగ్నెన్సీ తొందరగా రావాలంటే ఏం చెయ్యాలి? ఏ టైం లో కలవాలి?
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అగ్ని క్షిపణుల సిరీస్ లో అగ్ని-3 దాదాపుగా 40 టన్నుల బరువుతో 3000 కిలోమీటర్లు లక్ష్యాలను ఛేదించగలదు. అయితే అగ్ని 4 క్షిపణి అగ్ని-3 కన్నా 20 టన్నుల బరువు తక్కువగా ఉంటుంది. ఇది ఏకంగా 4000 కిలోమీటర్ల వరకు వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అయితే ఇప్పడు అగ్ని-5 గరిష్ట పరిమితి 5000 కిలోమీటర్లు అయినా.. బరువు తగ్గించడం వల్ల 7000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అవలీలగా చేధించగలదు. దీంతో యావత్ ఆసియా ఖండం మొత్తం అగ్ని-5 పరిధిలోకి వస్తుంది. అండమాన్ నికోబార్ కేంద్రంగా చూసుకుంటే ఆస్ట్రేలియా కూడా ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది.
రెండు రోజుల క్రితం అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది రక్షణ శాఖ. రాత్రిపూట ఈ ప్రయోగాన్ని విజయవంతంగా జరిపింది. గతంలో పోలిస్తే అగ్ని-5లో సాంకేతికత పెరిగింది. మూడు దశల్లో ఘన ఇంజన్లు క్షిపణికి చోధక శక్తిని ఇస్తాయి. అత్యంత ఖచ్చితత్వంతో ఇది టార్గెట్లను హిట్ చేయగలుగుతుంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్లను దృష్టిలో పెట్టుకుని భారత్ తన క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తోంది. అయితే ‘ నో ఫస్ట్ యూజ్’ అనే సొంత నియమానికి కట్టుబడి భారత క్షిపణి విధానం ఉంది.
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!