Agni-V: అగ్ని-5 క్షిపణి రేంజ్ పెరిగింది.. ఇక చైనాకు చుక్కలే..
Agni-V weight reduced, can now strike targets beyond 7,000 km: భారతదేశ ప్రతిష్టాత్మక బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 సామర్థ్యం మరింగా పెరిగింది. అగ్ని-5 బరువును గణనీయంగా తగ్గించడం వల్ల క్షిపణి మరింత దూరం ప్రయాణించేందుకు వీలు కలిగింది. ప్రస్తుతం అగ్ని-5 ఏకంగా 7000 కిలోమీటర్ల దూరంలోకి లక్ష్యాలను సునాయాసంగా సాధించగలదు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) క్షిపణి బరువును 20 శాతం తగ్గించడం వల్ల అగ్ని-5 రేంజ్ ను 5000 కిలోమీటర్ల నుంచి 7000 కిలోమీటర్లకు పెరిగింది. క్షిపణిలో స్టీల్ కంటెంట్ తగ్గించడంతో పాటు వాటిని తేలికైన మిశ్రమ లోహాలతో భర్తీ చేయడం వల్ల అగ్ని-5 రేంజ్ పెరిగినట్లు రక్షణ రంగ అధికారులు ప్రకటించారు. 20 శాతం బరువు తగ్గించడం వల్ల అగ్ని-5 అణు సామర్థ్య వార్ హెడ్ లతో 7000 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
Read Also: Quick Pregnancy : ప్రెగ్నెన్సీ తొందరగా రావాలంటే ఏం చెయ్యాలి? ఏ టైం లో కలవాలి?
Also Read
- Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- West Bengal Elections: రణరంగంగా బెంగాల్.. తొలి దశలోనే రక్తపాతం.. బాంబు దాడులు, దహనకాండ!
- PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
అగ్ని క్షిపణుల సిరీస్ లో అగ్ని-3 దాదాపుగా 40 టన్నుల బరువుతో 3000 కిలోమీటర్లు లక్ష్యాలను ఛేదించగలదు. అయితే అగ్ని 4 క్షిపణి అగ్ని-3 కన్నా 20 టన్నుల బరువు తక్కువగా ఉంటుంది. ఇది ఏకంగా 4000 కిలోమీటర్ల వరకు వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అయితే ఇప్పడు అగ్ని-5 గరిష్ట పరిమితి 5000 కిలోమీటర్లు అయినా.. బరువు తగ్గించడం వల్ల 7000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అవలీలగా చేధించగలదు. దీంతో యావత్ ఆసియా ఖండం మొత్తం అగ్ని-5 పరిధిలోకి వస్తుంది. అండమాన్ నికోబార్ కేంద్రంగా చూసుకుంటే ఆస్ట్రేలియా కూడా ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది.
రెండు రోజుల క్రితం అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది రక్షణ శాఖ. రాత్రిపూట ఈ ప్రయోగాన్ని విజయవంతంగా జరిపింది. గతంలో పోలిస్తే అగ్ని-5లో సాంకేతికత పెరిగింది. మూడు దశల్లో ఘన ఇంజన్లు క్షిపణికి చోధక శక్తిని ఇస్తాయి. అత్యంత ఖచ్చితత్వంతో ఇది టార్గెట్లను హిట్ చేయగలుగుతుంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్లను దృష్టిలో పెట్టుకుని భారత్ తన క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తోంది. అయితే ‘ నో ఫస్ట్ యూజ్’ అనే సొంత నియమానికి కట్టుబడి భారత క్షిపణి విధానం ఉంది.
తాజావార్తలు
-
Rain Alert: తెలంగాణ వాతావరణ శాఖ కీలక అలర్ట్.. ఈ జిల్లాల్లో వడగళ్ల వాన..
-
Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
-
Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
-
Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
-
Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!