BJP Lok Sabha Candidates: 100 అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన బీజేపీ.. జాబితాలో తెలంగాణ రాష్ట్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Lok Sabha Candidates: గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 4 గంటల వరకు బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం లోక్సభ అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చించింది. తొలి విడతలో 100 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు, త్వరలోనే జాబితా విడుదల చేస్తుందని తెలుస్తోంది. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలతో దక్షినాదిన తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ నివాసం నిన్న అమిత్ షా, జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఉత్తర్ ప్రదేశ్, మద్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల ఎంపీ స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన బలహీన స్థానాలతో పాటు, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు కూడా తొలిజాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయం ప్రాంతీయ పార్టీల పొత్తుల కారణంగా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో అకాలీదళ్, అన్నాడీఎంకేతో తిరిగి సంబంధాలను పునరుద్ధరించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
రాజ్యసభలో ఎంపీలుగా ఉన్న పలువరు కేంద్రమంత్రులు ఈసారి లోక్సభ బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్, ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయమంత్రి వీ మురళీధరన్ ఈసారి బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ మరోసారి వారణాసి నుంచి అమిత్ షా గాంధీనగర్, రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జ్యోతిరాధిత్య సింధియా మధ్యప్రదేశ్ గుణ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ తరుపున ఎంపీగా ఉన్న శత్రఘ్ను సిన్హాకు పోటీగా బీజేపీ భోజ్పురి స్టార్ పవన్ సింగ్ని బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!