BJP Lok Sabha Candidates: 100 అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన బీజేపీ.. జాబితాలో తెలంగాణ రాష్ట్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Lok Sabha Candidates: గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 4 గంటల వరకు బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం లోక్సభ అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చించింది. తొలి విడతలో 100 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు, త్వరలోనే జాబితా విడుదల చేస్తుందని తెలుస్తోంది. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలతో దక్షినాదిన తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ నివాసం నిన్న అమిత్ షా, జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఉత్తర్ ప్రదేశ్, మద్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల ఎంపీ స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన బలహీన స్థానాలతో పాటు, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు కూడా తొలిజాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయం ప్రాంతీయ పార్టీల పొత్తుల కారణంగా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో అకాలీదళ్, అన్నాడీఎంకేతో తిరిగి సంబంధాలను పునరుద్ధరించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
రాజ్యసభలో ఎంపీలుగా ఉన్న పలువరు కేంద్రమంత్రులు ఈసారి లోక్సభ బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్, ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయమంత్రి వీ మురళీధరన్ ఈసారి బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ మరోసారి వారణాసి నుంచి అమిత్ షా గాంధీనగర్, రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జ్యోతిరాధిత్య సింధియా మధ్యప్రదేశ్ గుణ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ తరుపున ఎంపీగా ఉన్న శత్రఘ్ను సిన్హాకు పోటీగా బీజేపీ భోజ్పురి స్టార్ పవన్ సింగ్ని బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!