BJP Lok Sabha Candidates: 100 అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన బీజేపీ.. జాబితాలో తెలంగాణ రాష్ట్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Lok Sabha Candidates: గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 4 గంటల వరకు బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం లోక్సభ అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చించింది. తొలి విడతలో 100 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు, త్వరలోనే జాబితా విడుదల చేస్తుందని తెలుస్తోంది. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలతో దక్షినాదిన తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ నివాసం నిన్న అమిత్ షా, జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఉత్తర్ ప్రదేశ్, మద్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల ఎంపీ స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన బలహీన స్థానాలతో పాటు, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు కూడా తొలిజాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయం ప్రాంతీయ పార్టీల పొత్తుల కారణంగా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో అకాలీదళ్, అన్నాడీఎంకేతో తిరిగి సంబంధాలను పునరుద్ధరించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
రాజ్యసభలో ఎంపీలుగా ఉన్న పలువరు కేంద్రమంత్రులు ఈసారి లోక్సభ బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్, ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయమంత్రి వీ మురళీధరన్ ఈసారి బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ మరోసారి వారణాసి నుంచి అమిత్ షా గాంధీనగర్, రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జ్యోతిరాధిత్య సింధియా మధ్యప్రదేశ్ గుణ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ తరుపున ఎంపీగా ఉన్న శత్రఘ్ను సిన్హాకు పోటీగా బీజేపీ భోజ్పురి స్టార్ పవన్ సింగ్ని బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..