India-Afghanistan: ‘‘ఆఫ్ఘాన్ మా పొరుగుదేశం’’.. పీఓకేపై పాక్కు భారత్ క్లియర్ మెసేజ్..
- ఆఫ్ఘనిస్తాన్ మా పొరుగు దేశం..
- పీఓకేపై పాకిస్తాన్కు భారత్ స్ట్రాంగ్ మెసేజ్..
- భారత్లో పర్యటిస్తున్న తాలిబాన్ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Afghanistan: భారతదేశంలో, ఆఫ్ఘానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ పర్యటిస్తున్నారు. తాలిబాన్లు 2021లో ఆఫ్ఘాన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత, భారత్లో ఒక తాలిబాన్ మంత్రి పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక రాజకీయాల కారణంగా ఆఫ్ఘాన్తో సత్సంబంధాలు భారత్కు ఇప్పుడు కీలకం. ఈ నేపథ్యంలోనే భారత్-ఆఫ్ఘాన్ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇరు దేశాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇండియాలో పర్యటిస్తున్న ముత్తాకీ, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో భేటీ అయ్యారు. ఆయన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్తో కూడా సమావేశం కానున్నారు.
ఇదిలా ఉంటే, ఈ పరిణామాలను పాకిస్తాన్ నిశితంగా గమనిస్తోంది. తాజాగా, భారత్ దాయాది దేశానికి క్లియర్ మెసేజ్ ఇచ్చింది. విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. ‘‘ఆఫ్ఘానిస్తాన్ తమ పొరుగున దేశం’’ అని ముత్తాకీతో కలిసి సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. నిజానికి, భారత్-ఆఫ్ఘనిస్తాన్ 106 కి.మీ ఇరుకైన భూ సరిహద్దును పంచుకుంటున్నాయి. దీనిని ‘‘వఖాన్ కారిడార్’’గా పిలుస్తారు. సాంకేతికంగా భారత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని గిల్గిత్ బాల్టిస్తాన్, ఈ వఖాన్ కారిడార్తో సరిహద్దును కలిగి ఉంది. అయితే, ఈ ప్రాంతం, పాకిస్తాన్ ఆక్రమణ చెరలో ఉంది. దీనినే మనం ‘‘పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)’’గా వ్యవహరిస్తున్నాం.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: Bengaluru: “సొంత దేశంలో రక్షణ లేదు”.. కన్నడలో తిడుతూ ఈశాన్య మహిళకు వేధింపులు..
జైశంకర్ ఆఫ్ఘాన్ను పొరుగుదేశంగా అభివర్ణించడం, పీఓకేపై పాకిస్తాన్కు భారత్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు అయింది. ఈ సమావేశంలో తర్వాత సంయుక్త ప్రకటనలో, భారత్ ఆఫ్ఘానిస్తాన్లు రెండూ సరిహద్దు ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. నేరుగా పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశమని జైశంకర్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లో పాక్ సైనిక చర్యల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
ఢిల్లీలో జైశంకర్-ముత్తాకీ సమావేశానికి కొన్ని గంటల ముందు పాకిస్తాన్, కాబూల్పై దాడి చేసింది. మరోవైపు, భారత్కు వ్యతిరేకంగా ఆఫ్ఘాన్ భూభాగం ఎలాంటి ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని ముత్తాకీ అన్నారు. ఆగస్టులో 2,000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న భూకంపం మరియు భారతదేశం కోవిడ్ వ్యాక్సిన్లను పంపిన మహమ్మారి వంటి కీలక సమయాల్లో భారతదేశం అందించిన మద్దతును ఆయన ప్రశంసించారు. ఆఫ్ఘాన్, భారత్ను మిత్రుడిగా చూస్తోందని, రెండు దేశాల ప్రజలు మంచి సంబంధాలను కోరుకుంటున్నారని, దీనికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!