Honeymoon Murder Case: రాజా హత్య కేసులో ట్విస్ట్! మేజిస్ట్రేట్ ముందు ప్లేట్ ఫిరాయించిన నిందితులు
- హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్!
- మేజిస్ట్రేట్ ముందు ప్లేట్ ఫిరాయించిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో నిందితులు ప్లేట్ ఫిరాయించారు. రాజాను చంపిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరు నేరాన్ని ఉపసంహరించుకున్నారు. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా నేరాన్ని అంగీకరించలేదు. మౌనంగా ఉండిపోయారు. దీంతో మేఘాలయ పోలీసులు షాక్కు గురయ్యారు. అంతకముందు పోలీసుల విచారణలో రాజాను చంపినట్లుగా నేరాన్ని అంగీకరించారు. తీరా కోర్టులో హాజరపరచగా ప్లేట్ ఫిరాయించారు. అయితే తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ పోలీసులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: BC Janardhan Reddy: బనగానపల్లెలో ఘనంగా మొహర్రం వేడుకలు.. పాల్గొన్న మంత్రి
Also Read
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ-యూపీకి చెందిన సోనమ్ రఘువంశీకి మే 11న వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. మే 23న హంతక ముఠాతో కలిసి భార్య సోనమ్.. భర్తను చంపేసి లోయలో పడేసింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తీరా చూస్తే నేరాన్ని అంగీకరించలేదు.
ఇది కూడా చదవండి: Iran-US Conflict: అమెరికాతో అణు చర్చలు జరిపే ఉద్దేశం లేదు..
షిల్లాంగ్ నగర పోలీసు సూపరింటెండెంట్, హత్య కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి ఖార్కోంగోర్ మాట్లాడుతూ.. ఆకాష్ రాజ్పుత్, ఆనంద్ కుర్మి గురువారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు మౌనంగా ఉన్నారని.. ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి నిరాకరించినట్లు తెలిపారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని మాత్రమే మేజిస్ట్రేట్ ముందుకు తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయని.. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే విచారణలో నిందితులంతా నేరాన్ని అంగీకరించారని.. కోర్టులో మాత్రం నిరాకరించారన్నారు. అయితే పోలీసుల వాదనను న్యాయస్థానం అంగీకరించలేదని తెలిపింది. ఇక నేరాన్ని ఒప్పుకోకపోవడం అనేది నిందితుల హక్కు అని.. అందుకే భౌతిక ఆధారాలు ప్రవేశపెడతామని చెప్పారు. దీంట్లో ఎలాంటి సమస్యలేదని. తగిన ఆధారాలు తమ దగ్గర ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.
మే 11న రాజా-సోనమ్కు వివాహం జరిగింది. అయితే సోనమ్కు అప్పటికే ప్రియుడు రాజ్ కుష్వాహా ఉన్నాడు. పెళ్లయ్యాక కూడా రాజ్ కుష్వాహాతో సోనమ్ సంబంధాలు కొనసాగించింది. పెళ్లైన 3 రోజులకే ప్రియుడి దగ్గరకు వచ్చి.. భర్త రాజాను చంపేందుకు కుట్ర పన్నింది. మే 20న హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకొచ్చి భర్తను చంపేసింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇక సోనమ్తో ఆమె కుటుంబ సభ్యులు బంధాలను తెంచుకున్నారు.
తాజావార్తలు
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
-
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
-
Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!