Honeymoon Murder Case: రాజా హత్య కేసులో ట్విస్ట్! మేజిస్ట్రేట్ ముందు ప్లేట్ ఫిరాయించిన నిందితులు
- హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్!
- మేజిస్ట్రేట్ ముందు ప్లేట్ ఫిరాయించిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో నిందితులు ప్లేట్ ఫిరాయించారు. రాజాను చంపిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరు నేరాన్ని ఉపసంహరించుకున్నారు. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా నేరాన్ని అంగీకరించలేదు. మౌనంగా ఉండిపోయారు. దీంతో మేఘాలయ పోలీసులు షాక్కు గురయ్యారు. అంతకముందు పోలీసుల విచారణలో రాజాను చంపినట్లుగా నేరాన్ని అంగీకరించారు. తీరా కోర్టులో హాజరపరచగా ప్లేట్ ఫిరాయించారు. అయితే తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ పోలీసులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: BC Janardhan Reddy: బనగానపల్లెలో ఘనంగా మొహర్రం వేడుకలు.. పాల్గొన్న మంత్రి
Also Read
ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ-యూపీకి చెందిన సోనమ్ రఘువంశీకి మే 11న వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. మే 23న హంతక ముఠాతో కలిసి భార్య సోనమ్.. భర్తను చంపేసి లోయలో పడేసింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తీరా చూస్తే నేరాన్ని అంగీకరించలేదు.
ఇది కూడా చదవండి: Iran-US Conflict: అమెరికాతో అణు చర్చలు జరిపే ఉద్దేశం లేదు..
షిల్లాంగ్ నగర పోలీసు సూపరింటెండెంట్, హత్య కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి ఖార్కోంగోర్ మాట్లాడుతూ.. ఆకాష్ రాజ్పుత్, ఆనంద్ కుర్మి గురువారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు మౌనంగా ఉన్నారని.. ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి నిరాకరించినట్లు తెలిపారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని మాత్రమే మేజిస్ట్రేట్ ముందుకు తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయని.. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే విచారణలో నిందితులంతా నేరాన్ని అంగీకరించారని.. కోర్టులో మాత్రం నిరాకరించారన్నారు. అయితే పోలీసుల వాదనను న్యాయస్థానం అంగీకరించలేదని తెలిపింది. ఇక నేరాన్ని ఒప్పుకోకపోవడం అనేది నిందితుల హక్కు అని.. అందుకే భౌతిక ఆధారాలు ప్రవేశపెడతామని చెప్పారు. దీంట్లో ఎలాంటి సమస్యలేదని. తగిన ఆధారాలు తమ దగ్గర ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.
మే 11న రాజా-సోనమ్కు వివాహం జరిగింది. అయితే సోనమ్కు అప్పటికే ప్రియుడు రాజ్ కుష్వాహా ఉన్నాడు. పెళ్లయ్యాక కూడా రాజ్ కుష్వాహాతో సోనమ్ సంబంధాలు కొనసాగించింది. పెళ్లైన 3 రోజులకే ప్రియుడి దగ్గరకు వచ్చి.. భర్త రాజాను చంపేందుకు కుట్ర పన్నింది. మే 20న హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకొచ్చి భర్తను చంపేసింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇక సోనమ్తో ఆమె కుటుంబ సభ్యులు బంధాలను తెంచుకున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!