Bihar: గోపాల్ ఖేమ్కా హత్య కేసులో నిందితుడు కంత్రీ ప్లాన్.. పూలదండ తీసుకుని..!
- గోపాల్ ఖేమ్కా హత్య కేసులో నిందితుడు కంత్రీ ప్లాన్
- పూలదండతో అంత్యక్రియలకు హాజరైన నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఇంటి ముందే ఖేమ్కాను తుపాకీతో కాల్చి చంపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ హత్య రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇక ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసులో నిందితుడు వేసిన కంత్రీ ప్లాన్ పోలీసుల ముందు బెడిసికొట్టింది. ఏమి ఎరగనట్టు అంత్యక్రియలకు హాజరై అడ్డంగా దొరికిపోయాడు.
ఇది కూడా చదవండి: Mahesh Babu: మహేశ్ బాబుని నిందితుడిగా పరిగణలోకి తీసుకుంటూ.. నోటీసులు జారీ!
Also Read
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
జూలై 4న రాత్రి 11:40 గంటల ప్రాంతంలో గోపాల్ ఖేమ్కా హత్యకు గురయ్యారు. ఈ హత్యలో అనేక మంది పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఖేమ్కా బయలుదేరిన దగ్గర నుంచి ఆయనను ఒక గుంపు వెంటాడుతూనే ఉంది. ఏఏ ప్రాంతాలకు చేరుకున్న విషయాలు ఎప్పుటికప్పుడు ముఠా పంచుకుంది. చివరిగా వాహనం ఇంటి దగ్గరకు రాగానే షూటర్గా సమాచారం అందించారు. ఇంటి గేటు ముందు వాహనం ఆగగానే నిందితుడు తుపాకీ తీసుకుని కాల్చేశాడు. అనంతరం బైక్పై పారిపోయాడు.
ఇది కూడా చదవండి: Rishab Shetty : కాంతారా చాప్టర్ 1 రిలీజ్ డేట్ ఎప్పుడంటే.?
ఇక ఖేమ్కా అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో రాజకీయ ప్రముఖులు, ప్రజలు హాజరై నివాళులర్పించారు. నిందితుల్లో ఒకడు కూడా తనపై ఏ మాత్రం అనుమానం రాకూడదన్న ఆలోచనతో పూలదండ తీసుకొని వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అయితే అప్పటికే సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులకు.. నిందితుడ్ని గుర్తించగలిగారు. వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నిందితుడు పాట్నాకు చెందిన పున్పున్ ప్రాంత నివాసి రోషన్ కుమార్గా గుర్తించారు. హత్య కేసులో ఎప్పటికప్పుడు సహచరులతో సమాచారం పంచుకున్నట్లుగా కనుగొన్నారు. ప్రస్తుతం స్టేషన్లో విచారిస్తున్నారు.
ఖేమ్కా బంకిపూర్ క్లబ్ నుంచి బయలుదేరినప్పుడు అక్కడే ఉన్న వ్యక్తి నిందితులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి గాంధీ మైదాన్ ప్రాంతంలోని బిస్కోమన్ టవర్ దగ్గర ఉండి వ్యాపారవేత్త తన నివాసానికి వస్తున్నట్లు అప్రమత్తం చేశాడని చెప్పారు. ఇతర నిందితులను కూడా పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇక ఖేమ్కా హత్య తర్వాత అధికార పార్టీపై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డాయి. కుమారుడిని చంపినప్పుడే నితీష్ కుమార్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటే..ఇప్పుడు ఖేమ్కా హత్యకు గురయ్యేవాడు కాదని ఎంపీ పప్పు యాదవ్ అన్నారు. మూడేళ్ల క్రితం ఖేమ్కా కుమారుడు కూడా హత్యకు గురయ్యారు. తండ్రి, కొడుకులిద్దరూ ఒకే మాదిరిగా చంపబడ్డారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!