Bihar: గోపాల్ ఖేమ్కా హత్య కేసులో నిందితుడు కంత్రీ ప్లాన్.. పూలదండ తీసుకుని..!
- గోపాల్ ఖేమ్కా హత్య కేసులో నిందితుడు కంత్రీ ప్లాన్
- పూలదండతో అంత్యక్రియలకు హాజరైన నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఇంటి ముందే ఖేమ్కాను తుపాకీతో కాల్చి చంపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ హత్య రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇక ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసులో నిందితుడు వేసిన కంత్రీ ప్లాన్ పోలీసుల ముందు బెడిసికొట్టింది. ఏమి ఎరగనట్టు అంత్యక్రియలకు హాజరై అడ్డంగా దొరికిపోయాడు.
ఇది కూడా చదవండి: Mahesh Babu: మహేశ్ బాబుని నిందితుడిగా పరిగణలోకి తీసుకుంటూ.. నోటీసులు జారీ!
Also Read
- Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
- Bangladesh: బంగ్లాదేశ్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
జూలై 4న రాత్రి 11:40 గంటల ప్రాంతంలో గోపాల్ ఖేమ్కా హత్యకు గురయ్యారు. ఈ హత్యలో అనేక మంది పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఖేమ్కా బయలుదేరిన దగ్గర నుంచి ఆయనను ఒక గుంపు వెంటాడుతూనే ఉంది. ఏఏ ప్రాంతాలకు చేరుకున్న విషయాలు ఎప్పుటికప్పుడు ముఠా పంచుకుంది. చివరిగా వాహనం ఇంటి దగ్గరకు రాగానే షూటర్గా సమాచారం అందించారు. ఇంటి గేటు ముందు వాహనం ఆగగానే నిందితుడు తుపాకీ తీసుకుని కాల్చేశాడు. అనంతరం బైక్పై పారిపోయాడు.
ఇది కూడా చదవండి: Rishab Shetty : కాంతారా చాప్టర్ 1 రిలీజ్ డేట్ ఎప్పుడంటే.?
ఇక ఖేమ్కా అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో రాజకీయ ప్రముఖులు, ప్రజలు హాజరై నివాళులర్పించారు. నిందితుల్లో ఒకడు కూడా తనపై ఏ మాత్రం అనుమానం రాకూడదన్న ఆలోచనతో పూలదండ తీసుకొని వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అయితే అప్పటికే సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులకు.. నిందితుడ్ని గుర్తించగలిగారు. వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నిందితుడు పాట్నాకు చెందిన పున్పున్ ప్రాంత నివాసి రోషన్ కుమార్గా గుర్తించారు. హత్య కేసులో ఎప్పటికప్పుడు సహచరులతో సమాచారం పంచుకున్నట్లుగా కనుగొన్నారు. ప్రస్తుతం స్టేషన్లో విచారిస్తున్నారు.
ఖేమ్కా బంకిపూర్ క్లబ్ నుంచి బయలుదేరినప్పుడు అక్కడే ఉన్న వ్యక్తి నిందితులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి గాంధీ మైదాన్ ప్రాంతంలోని బిస్కోమన్ టవర్ దగ్గర ఉండి వ్యాపారవేత్త తన నివాసానికి వస్తున్నట్లు అప్రమత్తం చేశాడని చెప్పారు. ఇతర నిందితులను కూడా పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇక ఖేమ్కా హత్య తర్వాత అధికార పార్టీపై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డాయి. కుమారుడిని చంపినప్పుడే నితీష్ కుమార్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటే..ఇప్పుడు ఖేమ్కా హత్యకు గురయ్యేవాడు కాదని ఎంపీ పప్పు యాదవ్ అన్నారు. మూడేళ్ల క్రితం ఖేమ్కా కుమారుడు కూడా హత్యకు గురయ్యారు. తండ్రి, కొడుకులిద్దరూ ఒకే మాదిరిగా చంపబడ్డారు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
-
Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
-
Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
-
Bangladesh: బంగ్లాదేశ్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!