దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు తీసుకున్నాడు మోసగాడు. ఒడిస్సా కు చెందిన సంబంధ్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్కు సీఈఓ, ఎండీ దీపక్ కిండో అరెస్ట్ అయ్యారు. నాబార్డ్ కు 5 కోట్లు లోన్ తీసుకున్న దీపక్… తిరిగి మూడు కోట్లు చెల్లించిన స్నేహితుడు మరో రెండు కోట్లుకు టోపి పెట్టడంతో.. నాబార్డ్ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసారు సిసిఎస్ పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు… దీపక్ కిండో పై తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో సైతం పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి.