Abhishek Banerjee: మమత మేనల్లుడికి బిగుస్తున్న ఉచ్చు.. మరో కేసు నమోదు..
- మమతా మేనల్లుడి చుట్టు బిగుస్తున్న ఉచ్చు..
- అభిషేక్ బెనర్జీపై రెండో కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Banerjee: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఓటమి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మమతా బెనర్జీ పార్టీకి ఆ పార్టీ నేతలు వరసగా షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామాలు చేయగా, మరికొందరు మమత తీరును, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అహంకారాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంపీ అభిషేక్పై మరో కేసు నమోదైంది. ఆయన చేసిన ఒక పోస్టు సమాజంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేదిగా ఉందని, ‘‘అత్యంత బాధ్యతారహితమైనది’’ అభివర్ణిస్తూ అర్నబ్ కాంతి దాస్ భవానీపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మే 2న ఆయన చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ కాపీని కూడా ఫిర్యాదుతో సహా అందించారు.
ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో టీఎంసీని ఓడించేందుకు ఎన్నికల సంఘం తమ పూర్తి శక్తిని ఉపయోగిస్తోందని టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ అభిషేక్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ బంగ్లా బిరోధి గుజరాతీ ముఠాకు, వారి తొత్తు జ్ఞానేష్ కుమార్కు నా డైమండ్ హార్బర్ మోడల్కు కనీసం ఒక గీత కూడా పెట్టడానికి పది జన్మలు కూడా సరిపోవు. మీ దగ్గర ఉన్నదంతా తీసుకురండి. నేను యావత్ భారత యూనియన్కు సవాలు విసురుతున్నాను – ఫల్తాకు రండి. మీలో అత్యంత బలవంతులను పంపండి, ఢిల్లీ నుండి గాడ్ఫాదర్లలో ఒకరిని పంపండి. మీకు దమ్ముంటే, ఫల్తాలో పోటీపడండి’’ అంటూ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Manipur: మణిపూర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి..
- PoK Protest: ప్లీజ్ మాకు సాయం చేయండి.. భారత్ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్..
- Gold Ring: తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన బంగారపు ఉంగరం.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Taj Mahal: తాజ్మహల్పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ.. కేంద్రానికి నోటీసులు
అయితే, ఈ సోషల్ మీడియా పోస్టులో ‘‘గుజరాతీ ముఠా’’ అని అనడం సమాజాన్ని విడగొట్టడమే అని, ముఠా అనే పదం నేరం, అండర్ వరల్డ్తో ముడి పడి ఉన్న పదం అని ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సమాజాన్ని ముఠాగా ముద్రవేయడం చట్ట స్పూర్తికి , దేశ సామాజిక నిర్మాణా స్పూర్తికి వ్యతిరేకమని అన్నారు.
ఎన్నికల్లో రెచ్చగొట్టేలా మాట్లాడాడని ఇప్పటికే బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అభిషేక్ బెనర్జీపై కేసు నమోదైంది. మే 4 ఫలితాలు వెలువడిన రోజు అర్ధరాత్రి మిమ్మల్ని కాపాడటానికి ఎవరు వస్తారో చూస్తానంటూ బీజేపీ కార్యకర్తల్ని, సపోర్టర్లను బెదిరించేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై రాజీబ్ సర్కార్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. తాజాగా నమోదైన కేసు రెండోది.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!