Abhishek Banerjee: మమత మేనల్లుడికి బిగుస్తున్న ఉచ్చు.. మరో కేసు నమోదు..
- మమతా మేనల్లుడి చుట్టు బిగుస్తున్న ఉచ్చు..
- అభిషేక్ బెనర్జీపై రెండో కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Banerjee: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఓటమి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మమతా బెనర్జీ పార్టీకి ఆ పార్టీ నేతలు వరసగా షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామాలు చేయగా, మరికొందరు మమత తీరును, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అహంకారాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంపీ అభిషేక్పై మరో కేసు నమోదైంది. ఆయన చేసిన ఒక పోస్టు సమాజంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేదిగా ఉందని, ‘‘అత్యంత బాధ్యతారహితమైనది’’ అభివర్ణిస్తూ అర్నబ్ కాంతి దాస్ భవానీపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మే 2న ఆయన చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ కాపీని కూడా ఫిర్యాదుతో సహా అందించారు.
ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో టీఎంసీని ఓడించేందుకు ఎన్నికల సంఘం తమ పూర్తి శక్తిని ఉపయోగిస్తోందని టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ అభిషేక్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ బంగ్లా బిరోధి గుజరాతీ ముఠాకు, వారి తొత్తు జ్ఞానేష్ కుమార్కు నా డైమండ్ హార్బర్ మోడల్కు కనీసం ఒక గీత కూడా పెట్టడానికి పది జన్మలు కూడా సరిపోవు. మీ దగ్గర ఉన్నదంతా తీసుకురండి. నేను యావత్ భారత యూనియన్కు సవాలు విసురుతున్నాను – ఫల్తాకు రండి. మీలో అత్యంత బలవంతులను పంపండి, ఢిల్లీ నుండి గాడ్ఫాదర్లలో ఒకరిని పంపండి. మీకు దమ్ముంటే, ఫల్తాలో పోటీపడండి’’ అంటూ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Uttar Pradesh: ఓవైసీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ..? యూపీలో కొత్త కూటమి..
- DMK: వెన్నుపోటుదారుడు, అతను బీజేపీకే లాభం.. రాహుల్ గాంధీపై డీఎంకే దాడి..
- Eknath Shinde: మహారాష్ట్రలో షిండే మరో ఎత్తుగడ.. మళ్లీ హాట్ టాఫిక్ కాబోతున్నారా?
- NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్లో టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం!
అయితే, ఈ సోషల్ మీడియా పోస్టులో ‘‘గుజరాతీ ముఠా’’ అని అనడం సమాజాన్ని విడగొట్టడమే అని, ముఠా అనే పదం నేరం, అండర్ వరల్డ్తో ముడి పడి ఉన్న పదం అని ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సమాజాన్ని ముఠాగా ముద్రవేయడం చట్ట స్పూర్తికి , దేశ సామాజిక నిర్మాణా స్పూర్తికి వ్యతిరేకమని అన్నారు.
ఎన్నికల్లో రెచ్చగొట్టేలా మాట్లాడాడని ఇప్పటికే బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అభిషేక్ బెనర్జీపై కేసు నమోదైంది. మే 4 ఫలితాలు వెలువడిన రోజు అర్ధరాత్రి మిమ్మల్ని కాపాడటానికి ఎవరు వస్తారో చూస్తానంటూ బీజేపీ కార్యకర్తల్ని, సపోర్టర్లను బెదిరించేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై రాజీబ్ సర్కార్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. తాజాగా నమోదైన కేసు రెండోది.
తాజావార్తలు
-
Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
-
Uttar Pradesh: ఓవైసీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ..? యూపీలో కొత్త కూటమి..
-
Kerala: నిపా నుంచి షిగెల్లా వరకు..కొత్త వ్యాధుల అడ్డాగా కేరళ ఎందుకు నిలుస్తోంది?
-
Actor Vishal : బొకేలు, శాలువాలు పక్కనబెట్టి కాలేజీ స్నేహితుల కలయిక
-
Anil Ravipudi: ఆ రేర్ ఫీట్కు ఒక్క అడుగు దూరంలో అనిల్ రావిపూడి.. కింగ్తో క్రేజీ కాంబో ఫిక్స్?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?