AAP: మహారాష్ట్ర, జార్ఖండ్లో పోటీపై ఆప్ నిర్ణయమిదే..!
- మహారాష్ట్ర
- జార్ఖండ్లో పోటీపై ఆప్ కీలక నిర్ణయం!
- ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని డిసైడ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవలే హర్యానా, జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్లో జరగనున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ.. హర్యానా, జమ్మూకాశ్మీర్లో పోటీ చేసి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది. ఒక్క జమ్మూకాశ్మీర్లో మాత్రం ఒక సీటును మాత్రం గెలిచింది. అయితే మహారాష్ట్ర, జార్ఖండ్లో పోటీపై ఆప్ సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో ఆప్కు అంత కేడర్ లేదు. అంత ఫాలోయింగ్ కూడా లేదు. ఇప్పటికే హర్యానాలో ఒంటరిగా పోటీ చేసి దెబ్బతింది. ఈ నేపథ్యంలో బరిలోకి దిగి ఇబ్బందులు పడే కంటే ఇండియా కూటమి అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే రెండు రాష్ట్రాల్లో పోటీ చేయకుండా కూటమి అభ్యర్థులకు సపోర్టు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం ఉన్నందున ఓటర్లలో గందరగోళం సృష్టించకూడదనే ఉద్దేశంతో మహారాష్ట్రలో పోటీకి దూరంగా ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని అంచనా వేశాకే తాము ఈ నిర్ణయానికి వచ్చామని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ ఏడాది మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో, జార్ఖండ్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. జార్ఖండ్లో మొదటి దశ పోలింగ్ నవంబర్ 13న, రెండో దశ నవంబర్ 20న జరగనుంది. రెండు రాష్ట్రాల ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ 2019లో కూడా మహారాష్ట్ర, జార్ఖండ్లలో పోటీ చేసింది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో 24 స్థానాల్లో బరిలో నిలవగా 23 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. జార్ఖండ్లోని 81 స్థానాలకు గానూ ఆ పార్టీ 26 స్థానాల్లో పోటీ చేయగా అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో 90 స్థానాలకుగాను 89 చోట్ల పోటీ చేసిన ఆప్ కేవలం 1.53 ఓట్ల శాతం మాత్రమే సాధించి డిపాజిట్లు పోగొట్టుకుంది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!