AAP: మహారాష్ట్ర, జార్ఖండ్లో పోటీపై ఆప్ నిర్ణయమిదే..!
- మహారాష్ట్ర
- జార్ఖండ్లో పోటీపై ఆప్ కీలక నిర్ణయం!
- ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని డిసైడ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవలే హర్యానా, జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్లో జరగనున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ.. హర్యానా, జమ్మూకాశ్మీర్లో పోటీ చేసి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది. ఒక్క జమ్మూకాశ్మీర్లో మాత్రం ఒక సీటును మాత్రం గెలిచింది. అయితే మహారాష్ట్ర, జార్ఖండ్లో పోటీపై ఆప్ సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో ఆప్కు అంత కేడర్ లేదు. అంత ఫాలోయింగ్ కూడా లేదు. ఇప్పటికే హర్యానాలో ఒంటరిగా పోటీ చేసి దెబ్బతింది. ఈ నేపథ్యంలో బరిలోకి దిగి ఇబ్బందులు పడే కంటే ఇండియా కూటమి అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే రెండు రాష్ట్రాల్లో పోటీ చేయకుండా కూటమి అభ్యర్థులకు సపోర్టు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం ఉన్నందున ఓటర్లలో గందరగోళం సృష్టించకూడదనే ఉద్దేశంతో మహారాష్ట్రలో పోటీకి దూరంగా ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని అంచనా వేశాకే తాము ఈ నిర్ణయానికి వచ్చామని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ ఏడాది మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో, జార్ఖండ్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. జార్ఖండ్లో మొదటి దశ పోలింగ్ నవంబర్ 13న, రెండో దశ నవంబర్ 20న జరగనుంది. రెండు రాష్ట్రాల ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ 2019లో కూడా మహారాష్ట్ర, జార్ఖండ్లలో పోటీ చేసింది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో 24 స్థానాల్లో బరిలో నిలవగా 23 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. జార్ఖండ్లోని 81 స్థానాలకు గానూ ఆ పార్టీ 26 స్థానాల్లో పోటీ చేయగా అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో 90 స్థానాలకుగాను 89 చోట్ల పోటీ చేసిన ఆప్ కేవలం 1.53 ఓట్ల శాతం మాత్రమే సాధించి డిపాజిట్లు పోగొట్టుకుంది.
తాజావార్తలు
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..