Delhi: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ వార్డు కమిటీ ఎన్నికల్లో దళితులకు ప్రాతినిధ్యం ఇవ్వండి..
- ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ వార్డు కమిటీల ఎన్నికల్లో దళితులకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదు..
- 2022లో త్రివిభజన చేసిన ఏంసీడీ ఏకీకరణ తర్వాత ఈ ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి..
- దళితులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తామని.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు: ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేందర్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aam Aadmi Party: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ వార్డు కమిటీల ఎన్నికల్లో దళితులకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైందని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ విమర్శించారు. 2022లో త్రివిభజన చేసిన ఏంసీడీ ఏకీకరణ తర్వాత ఈ ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి. దళితులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తామని.. అందులో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరిస్తామని.. ఖాళీగా ఉన్న పోస్టులకు ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకుంటామని గతంలో ఈ ప్రభుత్వం వాగ్దానం చేసిందని ఆయన తెలిపారు. ఇక, జోనల్ వార్డు కమిటీ ఎన్నికలను జాప్యం చేసేందుకు మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒబెరాయ్ తన పదవీ కాలాన్ని ఐదు నెలలు మించిపోయారని, దళిత అభ్యర్థిని మేయర్గా కాకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేందర్ యాదవ్ పేర్కొన్నారు.
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
ఇక, ఒబెరాయ్ ప్రిసైడింగ్ అధికారులను నియమించకుండా వార్డు కమిటీ ఎన్నికలను నిలిపివేయడానికి ప్రయత్నించారు అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ అన్నారు. ప్రక్రియను ఆలస్యం చేయడానికి కోర్టును ఆశ్రయించిన చివరికి అది తిరస్కరించబడింది. ప్రస్తుత ఎంసీడీ పదవీకాలం యొక్క మూడవ సంవత్సరంలో.. ఒబెరాయ్ పదవీకాలం మార్చి 31వ తేదీన ముగిసిన తర్వాత ఏప్రిల్లో దళిత అభ్యర్థిని మేయర్గా నియమించాలని ఆయన నొక్కి చెప్పారు. అయినప్పటికీ, ఒబెరాయ్ తన పదవిలో కొనసాగుతున్నారు. వార్డు కమిటీ ఎన్నికలను అడ్డుకున్నారు.. దీనిని “చట్టవిరుద్ధం”, రాజ్యాంగ విరుద్ధం” అన్నారు. ఎంసీడీ కార్యకలాపాలపై స్టాండింగ్, వార్డ్ కమిటీలు లేకపోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని ఎత్తిచూపారు. కౌన్సిలర్లు సమాజ అవసరాలను తీర్చలేకపోయారు అని మండిపడ్డారు. ఆప్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కమిషనర్ల మధ్య విభేదాలు పౌర వ్యవస్థను కుంగదీశాయని దేవేందర్ యాదవ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!