ఇక నుంచి ఒకే అమర్ జవాన్ జ్యోతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
50 ఏళ్లు గా సరిగ్గా “ఇండియా గేట్” కింద నిరంతరం వెలుగుతున్న “అమర్ జవాన్ జ్యోతి” శాశ్వతంగా ఆరిపోనుంది. ఇండియా గేట్ పక్కనే 40 ఎకరాల్లో 176 కోట్ల తో ఏర్పాటు చేసి, 2019, మార్చిలో ప్రధాని మోడీ ప్రారంభించిన “నేషనల్ వార్ మోమోరియల్” వద్ద ఏర్పాటు చేసిన “జ్యోతి”లో ఈ రెండింటిని ఏకం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రక్షణ దళాల ఎయిర్ మార్షల్ బలభద్ర రాధా కృష్ణ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఈ రెండు జ్యోతులను ఏకం చేస్తారు. గణతంత్ర దినోత్సవాలకు సరిగ్గా 5 రోజులు ముందు ఈ మార్పుకు రక్షణ శాఖ శ్రీకారం చుట్టబోతుంది.
Read Also: నేడు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్న బండి సంజయ్
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
నేషనల్ వార్ మెమోరియల్లోనే అమర్ జవాన్ జ్యోతి
1914-1921 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుధ్దంలో మరణించిన “బ్రిటీష్-ఇండియా సైన్యానికి” చెందిన సైనికుల సంస్మరణార్ధం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఇండియా గేట్ ను నిర్మించింది. 1971 లో పాకిస్థాన్తో జరిగన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి భారత వీర సైనికుల సంస్మరణార్ధం అమర్ జవాన్ జ్యోతిని భారత ప్రభుత్వం 1972లో ఏర్పాటు చేసింది. 1947-48 లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధం నుంచి ఇటీవల గాల్వన్ వ్యాలీలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పేర్లే కాకుండా, “ఇండియా గేట్” కట్టడం పై ఉన్న సైనికుల పేర్లను కూడా “నేషనల్ వార్ మెమోరియల్” (రాష్ట్రీయ సమర్ స్మారక్) లో గ్రానైట్ పలకల పై సువర్ణ అక్షరాలతో లిఖించారు. తీవ్రవాదులను తుదముట్టించే “ఆపరేషన్”లే కాకుండా, వివిధ సందర్భాలలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంస్మరణార్థం ఏర్పాటైన నేషనల్ వార్ మెమోరియల్లో మొత్తం 25,942 సైనికుల పేర్లను సువర్ణ అక్షరాలతో లిఖించడం జరిగింది. కాబట్టి, రెండు చోట్ల జ్యోతులు కాకుండా ఇక నుంచి ఓకే “అమర్ జవాన్ జ్యోతి” వెలిగేలా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు వాటిని ఏకం చేయనున్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!