UP: 7 ఏళ్ల వయసులో కిడ్నాపైన బాలుడు 30 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం
- 7 ఏళ్ల వయసులో కిడ్నాపైన బాలుడు 30 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం
- ఘజియాబాద్లోని ఖోడా పోలీస్ స్టేషన్కు చేరిక
- బంధువులకు అప్పగించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ సమీప ప్రాంతంలో ఏడేళ్ల వయసులో కిడ్నాపైన బాలుడు.. 30 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. క్షేమంగా పోలీసులు ఇంటికి చేర్చారు. ప్రస్తుతం అతడి వయసు 37 ఏళ్లు.
ఇది కూడా చదవండి: Ajmer Sharif Dargah: “అజ్మీర్ షరీఫ్ దర్గా ఒక శివాలయం”.. విచారణకు అంగీకరించిన కోర్టు..
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
రాజు అనే బాలుడు, తన సోదరితో కలిసి పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా ఢిల్లీకి సమీపంలోనే ఘజియాబాద్లో సెప్టెంబర్ 8, 1993లో కిడ్నాప్నకు గురయ్యాడు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా రాజస్థాన్ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని వచ్చేశాడు. తనది ఏ నగరమో గుర్తింది.. అది మనసులో పెట్టుకుని ఢిల్లీ చేరుకున్నాడు. రాజధాని చేరుకున్నాక.. అనేక పోలీస్ స్టేషన్లు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఐదు రోజుల క్రితం ఘజియాబాద్లోని ఖోడా పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. ఇక్కడి పోలీసులు అతడిని జాగ్రత్తగా చూసుకున్నారు. అతనికి బూట్లు ఇచ్చారు. అనంతరం ఆహారం, నీరు ఏర్పాటు చేశారు. మీడియా, సోషల్ మీడియాలో అతని గురించి సమాచారాన్ని ప్రచురించారు.
సమాచారం తెలుసుకున్న రాజు మామ పోలీసులను సంప్రదించాడు. అనంతరం అతని కుటుంబ సభ్యులు అతన్ని అక్కున చేర్చుకున్నారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి రజనీష్ ఉపాధ్యాయ్ తెలిపారు.
కిడ్నాపర్లు తనను రాజస్థాన్కు తీసుకెళ్లారని.. ఇన్నాళ్లూ అక్కడే ఉన్నానని రాజు చెప్పాడు. ప్రతిరోజూ కొట్టేవారని.. పనులు చేయింపించుకునేవారిని చెప్పాడు. సాయంత్రం ఒక్క రోటీ మాత్రమే ఇచ్చారని వాపోయాడు. తప్పించుకునే మార్గం లేక బంధించారని వివరించారు. మొత్తానికి కిడ్నాపర్లు నుంచి తప్పించుకుని ట్రక్కు ఎక్కి ఢిల్లీ వచ్చినట్లు తెలిపాడు.
ఇది కూడా చదవండి: Kollywood : ఐశ్వర్య – ధనుష్ లకు విడాకులు మంజూరు చేసిన కోర్టు
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!