Ajmer Sharif Dargah: “అజ్మీర్ షరీఫ్ దర్గా ఒక శివాలయం”.. విచారణకు అంగీకరించిన కోర్టు..
- అజ్మీర్ షరీఫ్ దర్గా ఒక శివాలయం..
- కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హిందూ సేన చీఫ్..
- విచారణకు స్వీకరించిన రాజస్థాన్ కోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajmer Sharif Dargah: దేశంలో పలు మసీదులపై ప్రస్తుతం కేసుల నడుస్తున్నాయి. కాశీలో జ్ఞానవాపి మసీదు, మథురలో శ్రీకృష్ణ జన్మభూమి, తాజాగా యూపీ సంభాల్ నగరంని జామా మసీదులు వివాదానికి కేరాఫ్గా మారాయి. గత ఆదివారం మసీదు సర్వేకు వచ్చిన అధికారులపై వేల మంది గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఈ హింసాత్మక ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 20 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. దీనిపై ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ అత్యున్నత విచారణ చేస్తోంది. ఈ జామా మసీదు మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో హరిహర్ మందిరమని కోర్టులో కేసు నడుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని చారిత్రక ఆధారాలను హిందూ పక్షం కోర్టు ముందు ఉంచింది.
Read Also: Priyanka Gandhi: ఎంపీగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!
Also Read
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
తాజాగా, అజ్మీర్ షరీఫ్ దర్గా నిజానికి శివాలయం అంటూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా దాఖలు చేసిన పిటిషన్ను రాజస్థాన్లోని అజ్మీర్లోని దిగువ కోర్టు విచారణకు స్వీకరించింది. అజ్మీర్ వెస్ట్ సివిల్ జడ్జి మన్మోహన్ చందేల్ అధ్యక్షత వహించిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 20కి షెడ్యూల్ చేసింది. సూఫీ సన్యాసి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి, నిజానికి శివుడి ఆలయమని గుప్తా పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసులో దర్గా కమిటీ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కి సమన్లు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. దర్గా కిటికీలపై ఓం మరియు స్వస్తిక చిహ్నాలు కనిపించాయని హిందూ పక్షం తన పిటిషన్లో పేర్కొంది.
ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో శివాలయం ఉందని చెప్పడం ఇదే మొదటిసారి కాదు. నిజానికి, ఇది చాలా కాలంగా క్లెయిమ్ చేయబడింది. హిందూ సంస్థ మహారాణా ప్రతాప్ సేన 2022లో దర్గాను ఆలయమని పేర్కొంటూ విచారణ జరిపించాలని అప్పటి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి