Ajmer Sharif Dargah: “అజ్మీర్ షరీఫ్ దర్గా ఒక శివాలయం”.. విచారణకు అంగీకరించిన కోర్టు..
- అజ్మీర్ షరీఫ్ దర్గా ఒక శివాలయం..
- కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హిందూ సేన చీఫ్..
- విచారణకు స్వీకరించిన రాజస్థాన్ కోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajmer Sharif Dargah: దేశంలో పలు మసీదులపై ప్రస్తుతం కేసుల నడుస్తున్నాయి. కాశీలో జ్ఞానవాపి మసీదు, మథురలో శ్రీకృష్ణ జన్మభూమి, తాజాగా యూపీ సంభాల్ నగరంని జామా మసీదులు వివాదానికి కేరాఫ్గా మారాయి. గత ఆదివారం మసీదు సర్వేకు వచ్చిన అధికారులపై వేల మంది గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఈ హింసాత్మక ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 20 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. దీనిపై ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ అత్యున్నత విచారణ చేస్తోంది. ఈ జామా మసీదు మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో హరిహర్ మందిరమని కోర్టులో కేసు నడుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని చారిత్రక ఆధారాలను హిందూ పక్షం కోర్టు ముందు ఉంచింది.
Read Also: Priyanka Gandhi: ఎంపీగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
తాజాగా, అజ్మీర్ షరీఫ్ దర్గా నిజానికి శివాలయం అంటూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా దాఖలు చేసిన పిటిషన్ను రాజస్థాన్లోని అజ్మీర్లోని దిగువ కోర్టు విచారణకు స్వీకరించింది. అజ్మీర్ వెస్ట్ సివిల్ జడ్జి మన్మోహన్ చందేల్ అధ్యక్షత వహించిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 20కి షెడ్యూల్ చేసింది. సూఫీ సన్యాసి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి, నిజానికి శివుడి ఆలయమని గుప్తా పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసులో దర్గా కమిటీ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కి సమన్లు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. దర్గా కిటికీలపై ఓం మరియు స్వస్తిక చిహ్నాలు కనిపించాయని హిందూ పక్షం తన పిటిషన్లో పేర్కొంది.
ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో శివాలయం ఉందని చెప్పడం ఇదే మొదటిసారి కాదు. నిజానికి, ఇది చాలా కాలంగా క్లెయిమ్ చేయబడింది. హిందూ సంస్థ మహారాణా ప్రతాప్ సేన 2022లో దర్గాను ఆలయమని పేర్కొంటూ విచారణ జరిపించాలని అప్పటి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!