Delhi Metro: 15 గంటల్లో 286 స్టేషన్లు కవర్ చేసిన ఓ వ్యక్తి.. గిన్నిస్ వరల్డ్ రికార్డు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Metro: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఢిల్లీ మెట్రో ఒకటి. అక్కడ 287 మెట్రో స్టేషన్లలో ప్రతిరోజూ 17 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఢిల్లీ మెట్రో పసుపు, నీలం వంటి 10 లైన్లలో విస్తరించి ఉంది. దీని నెట్వర్క్ 348.12 కి.మీ ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితిలో అన్ని స్టేషన్లను కవర్ చేయడానికి చాలా గంటలు పడుతుంది. ఏప్రిల్ 2021లో ఫ్రీలాన్స్ పరిశోధకుడు, ప్రయాణ ప్రియుడైన శశాంక్ మను ఢిల్లీ మెట్రోలో అలాంటి ఫీట్ చేసాడు. ఆ తర్వాత అతని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. అంతేకాకుండా ఆ వ్యక్తి ఇప్పటి వరకు 70 దేశాలు తిరిగినట్లు తెలుస్తోంది. అయితే తిరగడమంటే అతనికి ఎంత పిచ్చో..
Read Also: Lavanya Tripathi: మెగా కోడలు ఒక్కతే వెకేషన్ ఎంజాయ్ చేస్తుందే..
Also Read
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
శశాంక్ మను ఈ ఏడాది ఏప్రిల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డును మెట్రో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రఫుల్ సింగ్కు అందుకున్నాడు. ఆగస్ట్ 29, 2021న అతను ఢిల్లీ మెట్రోలోని అన్ని స్టేషన్లను కవర్ చేయడానికి 16 గంటల రెండు నిమిషాల సమయం తీసుకున్నాడు. కాగా.. మను 14 ఏప్రిల్ 2021న 15 గంటల 22 నిమిషాల 49 సెకన్లలో ఈ ఘనతను సాధించాడు. దీని తరువాత రికార్డును సరిదిద్దడానికి మను మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మధ్య కమ్యూనికేషన్ చాలా నెలలు జరిగింది. మను బ్లూ లైన్లో ఉదయం 5 గంటలకు రికార్డ్ ప్రయత్నాన్ని ప్రారంభించి.. గ్రీన్ లైన్లోని బ్రిగ్ హోషియార్ సింగ్ స్టేషన్లో రాత్రి 8.30 గంటలకు ముగించాడు.
Read Also: Ashada Bonalu: నరసరావుపేటలో అమ్మవారికి ఆషాడ బోనాలు సమర్పించిన ట్రాన్స్ జెండర్స్
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేయాలనే ఆలోచన మనుకి ఎలా వచ్చిందంటే.. కరోనా మహమ్మారి సమయంలో ఈ రికార్డును సృష్టించాలనే ఆలోచన తన మనసులో ఉందని మను చెప్పాడు. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత ఢిల్లీ మెట్రో తెరిచినప్పుడు ప్రయత్నించినట్లు తెలిపాడు. అతని లక్ష్యమేంటంటే.. ఢిల్లీ మెట్రో యొక్క అద్భుతమైన సేవ గురించి ప్రపంచానికి తెలియజేయడమని చెప్పాడు. ఢిల్లీ మెట్రో ప్రపంచంలోనే అత్యుత్తమ మెట్రో అని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఆ రికార్డును సాధించాలని ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రికార్డు సృష్టించాలంటే ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కి ప్రయాణించాలని.. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోని ఖచ్చితమైన మార్గదర్శకాలను పాటించాలని ఆయన చెప్పారు. ఆ సమయంలో అతను ప్రతి స్టేషన్లో ఫోటోగ్రాఫ్లు తీయవలసి ఉంటుంది. అంతేకాకుండా మను తన రికార్డును ప్రామాణీకరించడానికి ప్రతి మెట్రో స్టేషన్లో మెట్రో రైలు తలుపులు తెరవడం మరియు మూసివేసే సమయాల మధ్య ఒక అన్కట్ వీడియోను కూడా రికార్డ్ చేశాడు. రికార్డు కోసం ప్రయత్నించడం ఒకటని, దానిని వెరిఫై చేయడం మరొకటి అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!