Delhi Metro: 15 గంటల్లో 286 స్టేషన్లు కవర్ చేసిన ఓ వ్యక్తి.. గిన్నిస్ వరల్డ్ రికార్డు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Metro: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఢిల్లీ మెట్రో ఒకటి. అక్కడ 287 మెట్రో స్టేషన్లలో ప్రతిరోజూ 17 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఢిల్లీ మెట్రో పసుపు, నీలం వంటి 10 లైన్లలో విస్తరించి ఉంది. దీని నెట్వర్క్ 348.12 కి.మీ ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితిలో అన్ని స్టేషన్లను కవర్ చేయడానికి చాలా గంటలు పడుతుంది. ఏప్రిల్ 2021లో ఫ్రీలాన్స్ పరిశోధకుడు, ప్రయాణ ప్రియుడైన శశాంక్ మను ఢిల్లీ మెట్రోలో అలాంటి ఫీట్ చేసాడు. ఆ తర్వాత అతని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. అంతేకాకుండా ఆ వ్యక్తి ఇప్పటి వరకు 70 దేశాలు తిరిగినట్లు తెలుస్తోంది. అయితే తిరగడమంటే అతనికి ఎంత పిచ్చో..
Read Also: Lavanya Tripathi: మెగా కోడలు ఒక్కతే వెకేషన్ ఎంజాయ్ చేస్తుందే..
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
శశాంక్ మను ఈ ఏడాది ఏప్రిల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డును మెట్రో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రఫుల్ సింగ్కు అందుకున్నాడు. ఆగస్ట్ 29, 2021న అతను ఢిల్లీ మెట్రోలోని అన్ని స్టేషన్లను కవర్ చేయడానికి 16 గంటల రెండు నిమిషాల సమయం తీసుకున్నాడు. కాగా.. మను 14 ఏప్రిల్ 2021న 15 గంటల 22 నిమిషాల 49 సెకన్లలో ఈ ఘనతను సాధించాడు. దీని తరువాత రికార్డును సరిదిద్దడానికి మను మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మధ్య కమ్యూనికేషన్ చాలా నెలలు జరిగింది. మను బ్లూ లైన్లో ఉదయం 5 గంటలకు రికార్డ్ ప్రయత్నాన్ని ప్రారంభించి.. గ్రీన్ లైన్లోని బ్రిగ్ హోషియార్ సింగ్ స్టేషన్లో రాత్రి 8.30 గంటలకు ముగించాడు.
Read Also: Ashada Bonalu: నరసరావుపేటలో అమ్మవారికి ఆషాడ బోనాలు సమర్పించిన ట్రాన్స్ జెండర్స్
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేయాలనే ఆలోచన మనుకి ఎలా వచ్చిందంటే.. కరోనా మహమ్మారి సమయంలో ఈ రికార్డును సృష్టించాలనే ఆలోచన తన మనసులో ఉందని మను చెప్పాడు. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత ఢిల్లీ మెట్రో తెరిచినప్పుడు ప్రయత్నించినట్లు తెలిపాడు. అతని లక్ష్యమేంటంటే.. ఢిల్లీ మెట్రో యొక్క అద్భుతమైన సేవ గురించి ప్రపంచానికి తెలియజేయడమని చెప్పాడు. ఢిల్లీ మెట్రో ప్రపంచంలోనే అత్యుత్తమ మెట్రో అని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఆ రికార్డును సాధించాలని ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రికార్డు సృష్టించాలంటే ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కి ప్రయాణించాలని.. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోని ఖచ్చితమైన మార్గదర్శకాలను పాటించాలని ఆయన చెప్పారు. ఆ సమయంలో అతను ప్రతి స్టేషన్లో ఫోటోగ్రాఫ్లు తీయవలసి ఉంటుంది. అంతేకాకుండా మను తన రికార్డును ప్రామాణీకరించడానికి ప్రతి మెట్రో స్టేషన్లో మెట్రో రైలు తలుపులు తెరవడం మరియు మూసివేసే సమయాల మధ్య ఒక అన్కట్ వీడియోను కూడా రికార్డ్ చేశాడు. రికార్డు కోసం ప్రయత్నించడం ఒకటని, దానిని వెరిఫై చేయడం మరొకటి అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?