Cruel Mother: నువ్వసలు తల్లివేనా.. కాలేనూనెలో నాలుగు రోజుల చిన్నారి వేళ్లు పెడతావా ఛీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cruel Mother: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందిన రోజుల్లో ప్రజలు మూఢ విశ్వాసాలు కలిగి ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అనేకమంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా పలు ఆవిష్కరణలు జరిగాయి. మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సైన్సు పరిష్కారం చూపుతుంది. సైన్స్ వాస్తవంపై ఆధారపడి పనిచేస్తుంది. మతం నమ్మకం ఆధారంగా నడుస్తోంది. ఈ రోజుల్లో మూఢనమ్మకాలేంటి అనుకుంటామా.. ప్రజలు మాత్రం వాటిని వదలట్లేదు. వారసత్వ సంపదలా కొనసాగిస్తున్నారు. ఇలాంటి ప్రభావం అప్పుడే పుట్టిన పిల్లలపై చూపుతున్నారు తల్లిదండ్రులు. శిశువులపై చూపడమే కాదు మూఢనమ్మకాలతో వారిపై ప్రయోగాలు కూడా చేయడం ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే కొంతమంది ఒకమెట్టు పైకి ఎక్కి పుట్టిన బిడ్డ గురించి ఆలోచించడం మంచిదే కానీ..మూఢనమ్మకాలకు పోయి బిడ్డ వేళ్లను కాగే నూనెలో పెట్టిన వైనం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా ఫతేపూర్ లో చోటుచేసుకుంది.
Read also: Assam Floods: అస్సాంను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరదలు.. నిరాశ్రయులైన 34 వేల మంది
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా ఫతేపూర్ ప్రాంతంలోని ఇస్రౌలీ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా బానో దంపతులకు ఈ నెల 11న ఫతేపూర్ ఆరోగ్య కేంద్రంలో నిండు మగబిడ్డ జన్మించాడు. మొదటి 3-4 రోజులు ఆరోగ్యంగా ఉన్న చిన్నారి.. ఆ తర్వాత తల్లి పాలు తాగలేదు. దీంతో ఆసియా తీవ్ర ఆందోళనకు గురైంది. ఏం చేయాలో తోచక, హాస్పిటల్ స్టాఫ్ కు ఆమె సలహా అడిగింది. దీంతో ఆ స్టాఫ్ ఓ సలహా ఇవ్వడంతో వెనక ముందు ఆలోచించకుండా సలహాలను పాటించింది. ఇంతకీ ఆసుపత్రి వారు ఏం సలహా ఇచ్చారో తెలుసా? పుట్టిన బిడ్డ వేళ్లను కాగే నూనెలో పెట్టాలని. ఇది విన్న మనమే ఆశ్చర్యపోతుంటే.. ఆ తల్లి ఒక్కసారి కూడా ఆలోచించకుండా కాగే నూనెలో ఆ పశికందు వెళ్లు పెట్టడంతో ఆ చిన్నారి గట్టిగా కేకలు వేసింది.
నైట్ డ్యూటీలో ఉన్న నర్సు దీన్ని గమనించి వైద్యుడికి ఫిర్యాదు చేసింది. వెంటనే చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. గతంలో పాలు లేకపోవడంతో ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఆసియా.. ఆ భయంతోనే ఈ చర్యకు పాల్పడింది సమాచారం. అయితే ఇలాంటి ముఢనమ్మకాలు ఇప్పుడు కూడా నమ్మటం ఏంటిని పలువురు నెట్టిజన్లు ఫైర్ అవుతున్నారు. ఛీ నువ్వసలు తల్లివేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోనే ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Vizag MP Family Kidnap Case: కిడ్నాప్ కేసులో కీలక ట్విస్ట్.. ప్రియురాలికి రూ.40 లక్షలు
తాజావార్తలు
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!