Orissa Cyber Crime: పర్స్ పోయిందంటూ.. న్యాయవాదికే శఠగోపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Lawyer Cheated By Cyber Criminals In Orissa: ఒకవైపు సాంకేతికతను కొందరు మంచి పనుల కోసం వినియోగించుకుంటుంటే.. మరికొందరు చెడు పనులకు వాడుతున్నారు. ముఖ్యంగా.. సైబర్ నేరగాళ్లైతే ‘యాప్స్’ అప్డేట్ అవుతున్నట్టు, కొత్త పుంతలు తొక్కుతున్నారు. వినూత్నమైన మార్గాల్ని అనుసరిస్తూ.. ప్రజలకు కుచ్చటోపీ పెడుతున్నారు. చివరికి.. ప్రభుత్వ అధికారుల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు ఇద్దరు సైబర్ నేరగాళ్లు ఏకంగా న్యాయవాదికే శఠగోపం పెట్టారు. తెలిసిన వ్యక్తులమేనని నమ్మించి, అవసరానికి డబ్బు కావాలని రిక్వెస్ట్ చేసి.. రూ.30 వేలు లాగేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Self Pleasure: లైంగిక ఆనందం కోసం ఆ తప్పు చేశాడు.. ఉంగరం ఇరుక్కొని ఆసుపత్రిపాలయ్యాడు
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
కొరాపుట్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీరేష్ పట్నాయక్కు మంగళవారం ఉదయం 7750874432 నంబర్ నుంచి ఫోను వచ్చింది. తనని తాను దాస్ బాబుగా పరిచయం చేసుకున్నాడు. బీరేష్కు దాస్ బాబు అనే ఫ్రెండ్ ఉన్నాడు. అదే పేరు చెప్పేసరికి, తన స్నేహితుడే ఫోన్ చేసి ఉంటాడని భావించి, న్యాయవాది మాటలు కలిపాడు. ఆ క్రమంలో ఆ సైబర్ నేరగాడు ‘తాను ఆసుపత్రిలో ఉన్నానని, చికిత్స కోసం డబ్బులు అవసరం ఉన్నాయని, తాను ఇంట్లోనే పర్స్ మర్చిపోయానని చెప్పాడు. ఒక రోజులోగా డబ్బులు తిరిగిచ్చేస్తానని అన్నాడు. దీంతో.. ఆ న్యాయవాది తొలుత రూ.10 వేలు ఫోన్ పే ద్వారా పంపించాడు. కొద్దిసేపటికే మరోసారి ఫోన్ చేసి, ఇంకో రూ.10 వేలు అవసరం ఉందని అడిగేసరికి.. ఆ డబ్బులు కూడా ఫోన్ పే చేశాడు.
Actress Shobana: శోభన ఇంట్లో చోరీ.. ఆమె చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
కొద్దిసేపైయిన తర్వాత.. ఆ సైబర్ నేరగాడు ఆ న్యాయవాదికి ఫోన్ చేశాడు. తాను ఫోన్ పేలో మీ అకౌంట్కు రూ.30 వేలు పంపించానని చెప్పి, నకిలీ రసీదుని వాట్సాప్కు పంపించాడు. పొరపాటున రూ.10 వేలు అధికంగా పడ్డాయని, ఆ డబ్బు తిరిగి తనకు ట్రాన్స్ఫర్ చేయాలని కోరాడు. దీంతో.. ఆ న్యాయవాది తన అకౌంట్లో నిజంగానే రూ.30 వేలు పడ్డాయో లేదో చూసుకోకుండా, ఆ వ్యక్తి చెప్పినట్టు మరో రూ.10 వేలు అతనికి పంపించాడు. డబ్బులు పంపించాక అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే, అందులో నగదు నమోదైనట్టు దాఖలాలు లేవు. వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే.. అది స్విచ్ఛాప్గా వచ్చింది. దాంతో తాను మోసపోయానని గ్రహించి.. న్యాయవాది పోలీసుల్ని ఆశ్రయించాడు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?