Wolf Attack: వేటాడుతున్న తోడేళ్లు.. యూపీలో 8 మంది మృతి..
- ఉత్తర ప్రదేశ్ని వణికిస్తున్న తోడేళ్లు..
- బహ్రైచ్ జిల్లాలో వరసగా దాడులు..
- ఇప్పటి వరకు 8 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wolf attack: ఉత్తర ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో తోడేళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తోడేళ్ల దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో తోడేళ్ల దాడిలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఖారీపైర్లోని ఛత్తర్పూర్లో సోమ, మంగళవారం మధ్యరాత్రి 3,6,9 ఏళ్లు కలిగిన ముగ్గురు పిల్లలపై దాడి చేసినట్లుగా అధికారులు తెలిపారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకునేలోపే తోడేళ్లు సమీపంలోని రాయ్పూర్ గ్రామానికి వెళ్లాయని, అక్కడ 5 ఏళ్ల చిన్నారిని ఇంటి నుంచి పట్టుకెళ్లాయని చెప్పారు.
ఈ ప్రాంతంలో గత రెండు నెలలుగా తోడేళ్ల దాడులు ఎక్కువ అయ్యాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఏడుగురు చిన్నారులు, ఒక మహిళ సహా 8 మంది చనిపోయారు. బహ్రైచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో పడుకోవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.
Also Read
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
RAED ALSO: Mollywood: మలయాళ ఫిలిం ఇండస్ట్రీ లైంగిక వేధింపులు కలకలం.. ఇప్పటి వరకు 17 కేసులు..
ఈ దాడులు జరిగినప్పటి నుంచి అటవీశాఖతో పాటు స్థానిక పోలీసులు, నాలుగు జిల్లాల డివిజన్ ఫారెస్ట్ అధికారులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తోడేళ్ల దారి మళ్లించేందుకు అటవీ శాఖ ఏనుగు పేడ, మూత్రాన్ని కూడా వినియోగిస్తోంది. తోడేలు గుంపును పర్యవేక్షించడానికి హై ప్రీక్వెన్సీ డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్ల సాయంతో ఇప్పటి వరకు 6 తోడేళ్లను బంధించినట్లు అధికారులు చెప్పారు.
ఏనుగు పేడకు నిప్పటించడం ద్వారా సమీపంలో ఏనుగు లాంటి పెద్ద జంతువులు ఉన్నాయని భ్రమ కల్పించి తోడేళ్లు నివాస ప్రాంతాలకు దూరంగా వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వేటాడే గుణం ఉన్న తోడేళ్లు, ఏనుగు లాంటి పెద్ద జంతువుల జోలికి వెళ్లవు. గత 40 రోజుల్లో సుమారుగా 30 దాడులు జరిగాయని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తోడేళ్లు ఇళ్లలో నిద్రిస్తున్న వారిపై దాడి చేసి, వారిని ఈడ్చుకెళ్లి నిర్మానుష్య ప్రాంతాల్లో తినే పద్దతిని అనుసరిస్తాయని ఆయన చెప్పారు. తోడేళ్ల దాడుల కారణంగా అటవీ శాఖ, పోలీసులు, స్థానిక నివాసితులు రాత్రిపూట గస్తీ పెంచారు. అయితే, గస్తీ పెంచడంతో తోడేళ్లు తమ దాడి సమయాన్ని మార్చుకుంటున్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?