Viral Video: పింఛన్ కోసం వృద్ధురాలి పాట్లు.. ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా ఒంటి కాలితో నడక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
70-Year-Old Forced To Walk Barefoot To Collect Pension From Bank: వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే పింఛనే ఆసరా. ప్రభుత్వం ఇచ్చే రెండు మూడు వేలను నెలంతా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. అదే సమయంలో పింఛన్ సరైన సమయంలో రాకుంటే వారి బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. చాలా కుటుంబాల్లో కన్నవాళ్లు వృద్ధులైన తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడంతో ఈ పింఛనే ఆధారంగా ఉంటోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పింఛన్ కోసం పడుతున్న పాట్లు పలువురితో కంటతడిపెట్టిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలో తన వృద్ధాప్య పింఛను కోసం 70 ఏళ్ల వృద్ధురాలు చెప్పులు లేకుండా కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన హృదయవిదారకంగా ఉంది. జిల్లాలోని ఝరిగావ్ బ్లాక్ బానూగూడ గ్రామానికి చెందిన సూర్య హరిజన్ అనే మహిళ విరిగిన కుర్చీని ఆసరాగా చేసుకుని ఎండవేడిలో చెప్పులు లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిరుపేదలకు సాయం చేయడానికి ప్రభుత్వ పథకాలు అమలులో ఉన్నప్పటికీ, సూర్య మహాజన్ కు వివిధ కారణాల వల్ల అందడం లేదు.
#WATCH | A senior citizen, Surya Harijan walks many kilometers barefoot with the support of a broken chair to reach a bank to collect her pension in Odisha's Jharigaon
SBI manager Jharigaon branch says, "Her fingers are broken, so she is facing trouble withdrawing money. We'll… pic.twitter.com/Hf9exSd0F0
— ANI (@ANI) April 20, 2023
సూర్య హరిజన్ పెద్ద కొడుకు వలసకూలీగా వేరే రాష్ట్రానికి వెళ్లగా.. మరో కొడుకు పశువులను మేపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. చిన్న గుడిసెలో కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో వృద్ధురాలికి పింఛన్ డబ్బులు చేతికి అందేవి, కానీ ప్రస్తుతం ఆమె బ్యాంక్ ఖాతాలో పింఛన్ డబ్బులు పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఆమె ఎడమ చేయి బొటన వేలిముద్ర కొన్ని సార్లు సరిపోవడం లేదు, దీంతో పింఛన్ డబ్బులు చెల్లించడం సమస్యగా మారుతోందని సదరు బ్యాంక్ చెబుతోంది. 4 నెలలుగా ఆమెకు పింఛన్ అందలేదని, దీంతో ఆమె బ్యాంకు వెళ్లాల్సి రావడంతో ఇలా కుర్చీనే చేతికర్రగా ఉపయోగించుకుని ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా ప్రయాణించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో అధికార యంత్రాంగం దిగివచ్చింది. ఆమెకు ఇంటికే పింఛన్ పంపిస్తామని, ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!